లబ్బూరు జంక్షన్ వద్ద 45 కిలోల గంజాయి స్వాధీనం

ముంచంగిపుట్టు,ఐఏషియ న్యూస్: ముంచంగిపుట్టు మండలం లబ్బూరు జంక్షన్ వద్ద 45కిలోల గంజాయి పట్టుబడిందని ఎస్ఐ జె. రామకృష్ణ తెలిపారు. ముందస్తు సమాచారంతో సిబ్బందితో కలిసి శనివారం సాయంత్రం వాహనాలు తనిఖీ చేశారు. రెండు బైక్ ల పై గంజాయి తరలిస్తుండగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బైకులను సీజ్ చేసి ఒడిశాకు చెందిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. గంజాయి విలువ సుమారు రూ.1.35లక్షలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

హైదరాబాద్ లో డ్రగ్స్ పెడ్లింగ్ ముఠా అరెస్ట్

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: హైదరాబాద్ లో మాదకద్రవ్యాల వ్యాపారం మరోసారి కలకలం రేపింది. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ , చిక్కడపల్లి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *