International

హిందూజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ హిందూజా మృతి

లండన్,ఐఏషియ న్యూస్: హిందూజా గ్రూప్ ఛైర్మన్ గోపీచంద్ పి. హిందూజా (85) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న హిందూజా లండన్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం కన్నుమూశారు.హిందుజా ఫ్యామిలీలో రెండో తరానికి చెందిన గోపీచంద్ 2023లో గ్రూప్ సంస్థలకు ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయన సోదరుడు శ్రీచంద్ మరణానంతరం బాధ్యతలు స్వీకరించారు.గోపీచంద్ హిందుజాకు భార్య సునీత, కుమారులు సంజయ్, ధీరజ్, కుమార్తె రీతా ఉన్నారు. ఇండో- మిడిల్ ఈస్ట్ ట్రేడింగ్ ఆపరేషన్స్ నిర్వహించే సంస్థను అంతర్జాతీయ దిగ్గజ …

Read More »

ట్రంప్ పార్టీ అభ్యర్థి ఓటమి: రిపబ్లికన్ పార్టీకి గట్టి షాక్

వర్జీనియా,ఐఏషియ న్యూస్: అమెరికాలో ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. వర్జీనియా ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి సీయర్స్ ఓటమి పాలయ్యారు. డెమొక్రాట్ అభ్యర్థి అబిగైల్ స్పాన్బర్గర్ గవర్నర్ గా ఎన్నికయ్యారు. అబిగైల్ కు 14.80 లక్షల ఓట్లు పోలవ్వగా, సీయర్కు 11.61 లక్షల ఓట్లు వచ్చాయి. దీంతో 3.20 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. వర్జీనియా చరిత్రలో తొలి మహిళా గవర్నర్ అబిగైలే కావడం విశేషం.దీంతో ట్రంప్ పార్టీ నాయకులు డీలాపడ్డారు. Authored by: Vaddadi udayakumar

Read More »

అమెరికా, శాన్ఫ్రాన్సిస్కోకు ఆహ్వానించబడ్డ డాక్టర్ బారువా,డాక్టర్ పాణిగ్రాహి ముగిసిన ట్రాన్స్‌కాథెటర్ కార్డియోవాస్కులర్ థెరప్యూటిక్స్ (టిసిటి) సెమినార్

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖపట్నంలోని హెల్త్ సిటీ, అపోలో హాస్పిటల్స్‌లో సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ క్యాథ్ ల్యాబ్ డైరెక్టర్ డాక్టర్ డి కె బారువ, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, డాక్టర్ ఎన్ కే పాణిగ్రాహి ఇటీవల ముగిసిన ట్రాన్స్‌కాథెటర్ కార్డియోవాస్కులర్ థెరప్యూటిక్స్ (టిసిటి), 2025లో అంతర్జాతీయ అధ్యాపకులుగా ఆహ్వానించబడ్డారు. అమెరికా, శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన ట్రాన్స్‌కాథెటర్ కార్డియోవాస్కులర్ థెరప్యూటిక్స్ (టిసిటి), 2025లో అంతర్జాతీయ అధ్యాపకుడిగా ఆహ్వానించబడ్డారు. డయాబెటిస్, రక్తపోటు, మూత్రపిండాల వ్యాధి పెరుగుతున్న ప్రాబల్యం, బెలూన్ యాంజియోప్లాస్టీ (పీటీసీఏ) ద్వారా సిసిఏడి చికిత్సలో ఎక్కువమంది వృద్ధ రోగులను …

Read More »

భారత్ అమెరికాల మధ్య కీలక 10ఏళ్ల రక్షణ ఒప్పందం

న్యూయార్క్,ఐఏషియ న్యూస్: ఒకవైపు భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం సుంకాలతో విరుచుకుపడుతున్న వేళ భారత్‌కు ఓభారీఊరటలభించింది.భారత్-అమెరికాల మధ్య వ్యూహాత్మక, భద్రతా సహకారం సరికొత్త శిఖరాలను చేరుకునేలా కీలక డీల్ కుదిరింది. మలేసియాలో జరిగిన ఒక కీలక సమావేశంలో రెండు దేశాల మధ్య కొత్త 10 ఏళ్ల రక్షణ ఫ్రేమ్‌వర్క్ ఒప్పందంపై సంతకాలు చేశాయి. మలేసియా ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం సందర్భంగా భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ భేటీ అయ్యారు. …

Read More »

2047 నాటికి గ్లోబల్ ఎకనమిక్ పవర్ హౌస్ గా ఆంధ్రప్రదేశ్

జనవరి నుంచి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ సేవలు ఆస్ట్రేడ్ ఎగ్జిక్యూటివ్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా (మెల్బోర్న్),ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ను 2047 నాటికి గ్లోబల్ ఎకనమిక్ పవర్ హౌస్ గా మార్చడమే మా లక్ష్యం. సాంకేతిక ఆవిష్కరణలు, సుస్థిరమైన సమగ్రాభివృద్ధి ద్వారా ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు అందించడమే తమ సంకల్పమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మెల్బోర్న్ లో ఆస్ట్రేలియా ట్రేడ్ అండ్ ఇన్వెస్టిమెంట్ కమిషన్ ఎగ్జిక్యూటివ్ లతో నిర్వహించిన రౌండ్ టేబుల్ …

Read More »

మత్స్యకారులను క్షేమంగా తీసుకువస్తాం: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు భరోసా

శ్రీకాకుళం,ఐఏషియ న్యూస్: విజయనగరం జిల్లాకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు బంగ్లాదేశ్ నేవీ సిబ్బందికి పట్టుబడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. బాధిత కుటుంబాలకు పూర్తి భరోసా కల్పించారు, మత్స్యకారులను క్షేమంగా తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే విదేశాంగ శాఖ మంత్రితో సంప్రదింపులు జరిపారు.బంగ్లాదేశ్ ఎంబసీతో నిరంతర సంప్రదింపులు, నిశిత పరిశీలన చేస్తున్నారు.సముద్ర భద్రత, చట్టం, రక్షణ వ్యవహారాలు చూసే కోస్ట్ గార్డ్ వ్యవస్థతో ఈ సమస్యపై మాట్లాడారు. ఈ సమస్యను పరిష్కరించి, మత్స్యకారులను సురక్షితంగా …

Read More »

లాజిస్టిక్స్, గిడ్డంగుల ఏర్పాటుకు రాష్ట్రానికి రండి

షరాఫ్ గ్రూప్ సంస్థకు సీఎం చంద్రబాబు ఆహ్వానం దుబాయ్,ఐఏషియ న్యూస్: షరాఫ్‌ గ్రూప్ వైస్ ఛైర్మన్,షరాఫ్ డీజీ సంస్థ వ్యస్థాపకుడు షరాఫుద్దీన్ షరాఫ్‌తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం భేటీ అయ్యారు.రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలపై షరాఫ్‌తో చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లోని మౌలిక వసతులు, మావన వనరుల లభ్యత, అలాగే ఇతర అనుకూలతల గురించివివరించారు.బుధవారం యూఏఈలో తొలిరోజు పర్యటనలో భాగంగా షరాఫ్ గ్రూప్,వైస్,చైర్మన్‌,సీఎంచంద్రబాబుసమావేశమయ్యారు.ఆంధ్రప్రదేశ్‌లో లాజిస్టిక్స్ ప్రాజెక్టుల ఏర్పాటు గురించి ప్రధానంగా చర్చించారు. షరాఫ్ గ్రూప్‌ ఇప్పటికే భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో లాజిస్టిక్స్‌ పార్కులను అభివృద్ధి …

Read More »

నేడు యూఏఈకి సీఎం చంద్రబాబు

పెట్టుబడుల సాధనకు ముఖ్యమంత్రి మూడు రోజుల పర్యటన పారిశ్రామిక వేత్తలతో రోడ్ షో,తెలుగు డయాస్పొరా సమావేశాల్లో పాల్గొననున్న చంద్రబాబు విశాఖ సమ్మిట్‌కు పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించనన్న ముఖ్యమంత్రి యూఏఈలో పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులతో భేటీ 3 రోజుల్లో 25 సమావేశాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు అమరావతి,ఐఏషియ న్యూస్: విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వ ప్రతినిధుల్ని ఆహ్వానిస్తోంది. ఈ మేరకు సింగపూర్ దేశంలో గతంలో పర్యటించిన ముఖ్యమంత్రి బృందం.. ఇప్పుడు యూఏఈకి …

Read More »

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం: తల్లి కూతురు మృతి

తెలంగాణ రాష్ట్రం మంచిర్యాలలో విషాదఛాయలు వాషింగ్టన్,ఐఏషియ న్యూస్: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన తల్లీ కూతురు మృతి చెందారు. అదే కుటుంబంలో మరి కొంతమందికి గాయాలయ్యాయి. ఆ కుటుంబం ప్రయాణిస్తున్న కారును ఓ టిప్పర్ ఢీ కొట్టడంతో తల్లీ కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డ మరికొందరు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వార్తతో మంచిర్యాల లోని రెడ్డి కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.కూతురి గృహ ప్రవేశానికి అమెరికా వెళ్లి అక్కడే తిరిగిరాని …

Read More »

Jayanti Celebrations of Dr.Suri Bhagavantam

డాక్టర్ సూరి భగవంతం 116వ జయంతి ఉత్సవాలు ఈరోజు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ సూరి భగవంతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాచిగూడ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తు చేస్తూ, విద్యార్థులకు ప్రేరణనిచ్చేలా ఈ వేడుకలు సాగాయి. 🌟 ముఖ్య అతిథులు: – డాక్టర్ ఎస్. సూరి, వ్యవస్థాపకుడు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెచ్యూర్ రేడియో (NIAR), హం రేడియో వ్యవస్థ, ఉపగ్రహ అనుసంధానం వంటి అంశాలపై విద్యార్థులకు ప్రత్యక్ష డెమోనిస్ట్రేషన్ ద్వారా అవగాహన …

Read More »