విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల14న రాత్రి ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకొని పథకం ప్రకారం జరిగిన దోపిడీ కేసును విశాఖపట్నం సిటీ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. సీసీటీవీ ఫుటేజ్లు, సెల్ టవర్ లొకేషన్లు, కాల్ డేటా విశ్లేషణ ద్వారా సుమారు 300 కిలోమీటర్ల మేర నిందితుల కదలికలను ట్రాక్ చేసి రాజోలు వద్ద నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా, దొంగిలించిన సుమారు 10 తులాల బంగారు ఆభరణాలు, 8 తులాల వెండి ఆభరణాలు, నేరానికి ఉపయోగించిన సెల్ ఫోన్లను …
Read More »crime
ద్రాక్షారామంలో అపచారం: శివలింగం ధ్వంసం చేసిన దుండగులు
ద్రాక్షారామం,ఐఏషియ న్యూస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కలకలం చోటు చేసుకుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ద్రాక్షారామ భీమేశ్వరాలయం సప్తగోదావరి తీరాన ఉత్తర గోపురం వద్ద ఉన్న కపాలేశ్వరస్వామి శివలింగాన్ని దుండగులు సోమవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు.మంగళవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు,భక్తులుతీవ్రదిగ్భ్రాంతిచెందారు.శివలింగంపై సుత్తి వంటి మొనదేలిన ఆయుధంతో కొట్టి విరగ్గొట్టి ధ్వంసం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ సంఘటన జరిగిన విషయం తెలిసిన వెంటనే కాకినాడ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఘటనా స్థలానికి చేరుకుని స్వయంగా పరిశీలించారు. క్లూస్ …
Read More »ప్రేమ పెళ్లిళ్లు ‘స్టాక్ మార్కెట్’ లాంటివి..
మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు ప్రేమవివాహాల్లో ఒడిదుడుకులు సహజమన్న హైకోర్టు ధర్మాసనం తమను కాదని వెళ్లిన కూతురి కోసం కోర్టుకెక్కిన వృద్ధ తల్లిదండ్రులు యువతి మేజర్ అయినందున ఆమె నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ పిల్లల మనోభావాలను తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలని సూచన చెన్నై,ఐఏషియ న్యూస్: ప్రేమ వివాహాలపై మద్రాస్ హైకోర్టులోని మదురై బెంచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రేమ పెళ్లిళ్లు ‘స్టాక్ మార్కెట్’ లాంటివని,వాటిలో లాభనష్టాలు, ఒడిదుడుకులు సర్వసాధారణమని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.తిరుచ్చికి చెందిన ఓ నర్సు అదృశ్యంపై దాఖలైన హెబియస్ కార్పస్ …
Read More »ప్రజాశాంతికి భంగం కలిగిస్తే ఊరుకునేది లేదు
కొత్తవలస సిఐ షణ్ముఖరావు హెచ్చరిక కొత్తవలస,ఐఏషియ న్యూస్: నూతన సంవత్సర వేడుకలను ఈనెల 31వ తేదీన కొత్తవలస మండలంలో శాంతియుతంగా నిర్వహించుకోవాలని, వేడుకల పేరుతో ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని కొత్తవలస సిఐ సి.హెచ్. షణ్ముఖరావు హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకొనేందుకు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ప్రజలకు కొన్ని సూచనలు చేసారని సిఐ మీడియాకు వివరించారు. 31రాత్రి బహిరంగ ప్రదేశాల్లో, రహదారులపై నూతన సంవత్సర వేడుకలను నిర్వహించరాదన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. మండల …
Read More »రాష్ట్ర క్రైమ్ రివ్యూ సమావేశం: నేరాల నివారణపై సమగ్ర సమీక్ష
అమరావతి,ఐఏషియ న్యూస్: తాడేపల్లిలో రాష్ట్ర స్థాయి క్రైమ్ రివ్యూ సమావేశం శనివారం జరిగింది. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సమావేశంలో ప్రస్తుత ఏడాదిలో నమోదైన నేరాలు, వాటిపై విధించిన శిక్షలు,కేసుల పురోగతిపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. నేరాల నియంత్రణ, కేసుల త్వరిత పరిష్కారం దిశగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.సైబర్ క్రైమ్, క్రిప్టో కరెన్సీ దుర్వినియోగం, బ్లాక్ చైన్ టెక్నాలజీ, డీప్ ఫేక్ టెక్నాలజీ వంటి ఆధునిక సవాళ్లను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన నివారణ చర్యలపై మంత్రి అనిత అధికారులతో చర్చించారు. …
Read More »19 ఏళ్లకే ఎనిమిది పెళ్లిళ్లు.. పెళ్లి పేరుతో మోసం చేస్తున్న ఇచ్చాపురం యువతి
ఇచ్చాపురం,ఐఏషియ న్యూస్: మూడు ముళ్లు బంధంతో ఇద్దరు వ్యక్తులు ఒక్కటయ్యే వేడుకే వివాహం. కేవలం ఇద్దరు వ్యక్తులే కాకుండా వారి కుటుంబాలు సైతం ఒక్కటవుతాయి. అందుకే పెళ్లి విషయంలో అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసి అయినా కానీ మంచి సంబంధం ఫిక్స్ చేసుకోవాలని అంటారు. కానీ ఓ కిలేడీ మాత్రం.. 19 ఏళ్లకే 8 మందిని పెళ్లిళ్లు చేసుకుని వివాహం జరిగిన వారం రోజుల్లోపే డబ్బుతో ఉడాయిస్తూ మోసాలకు తెరలేపింది. ఈ యమా డేంజర్ యువతి కథాకమామిషు ఏంటో తెలుసుకుందాం. …
Read More »రౌడీయిజం చేస్తే “రాష్ట్ర బహిష్కరణ” చేస్తా
ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని కొందరు రాజకీయ ముసుగులో ఉండే రాజకీయం రౌడీయిజం చేస్తామంటే కుదరదని, అలాంటివారిని రాష్ట్ర బహిష్కరణ చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తిరుపతిలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన నూతన జిల్లా పోలీసు కార్యాలయాన్ని హోం మంత్రి అనితతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు.అనంతరం అక్కడే ఉన్న విజిటర్స్ పుస్తకంలో సీఎం తన అభిప్రాయాలను, సూచనలను రాశారు. పోలీసులు టెక్నాలజీ వాడాలన్న సీఎం చంద్రబాబు …
Read More »గంజాయి రవాణా చేస్తున్న మహిళతో సహా ఏడుగురు అరెస్ట్
నర్సీపట్నం,ఐఏషియ న్యూస్: నర్సీపట్నాన్ని అడ్డాగా చేసుకుని శ్రీలంకకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న గాదె రేణుకను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు శారద నగర్లో అద్దె ఇంట్లో ఉంటూ గత ఏడాది కాలంగా రవాణానిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో నాలుగుసార్లు పట్టు బడినట్లు సమాచారం ఈ కేసులో మరో ఏడు మందిని అదుపులోకి తీసుకున్నామని నర్సీపట్నం పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేస్తూ గాదె రేణుక పోలీసు లకు చిక్కింది వాహన తనిఖీల్లో రేణుకతో పాటు మరో ఏడు మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.రూ.18.50 …
Read More »భీమవరం డిఎస్పి జయసూర్య బదిలీ
భీమవరం,ఐఏషియ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్యను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన స్థానంలో నూతన డీఎస్పీగా రఘువీర్ విష్ణును నియమించారు. పేకాట నిర్వహణ వివాదాల్లో చిక్కుకున్న డీఎస్పీ జయసూర్య పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక దశలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే డి.ఎస్.పి జయసూర్య చాలా మంచి అధికారి అని శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కితాబు ఇచ్చారు. ఇలా ఇద్దరి మధ్య నలుగుతున్న ఈ …
Read More »రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
ఉత్తరప్రదేశ్ (షాజహాన్పూర్) ,ఐఏషియ న్యూస్: తప్పు అని తెలిసినా.. కొంత మంది చేసే నిర్లక్ష్యం ప్రాణాలకు ముప్పు తెస్తుంది. ఒక చిన్న తప్పువల్ల కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉత్తర్ప్రదేశ్లోని షాజహాన్పూర్లో రైల్వే ట్రాక్ దాటుతుండగా మోటార్ సైకిల్ను ప్యాసింజర్ రైలు ఢీ కొట్టడంతో ఒకే కుటుంబానికి చెదిన ఐదుగురు అక్కడిక్కడే మృతిచెందారు. రౌజా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. లక్నో వైపు నుంచి వస్తున్న ప్యాసింజర్ రైలు మోటర్ వెహికిల్ గేట్ దాటుతున్న సమయంలో ఢీకొట్టింది. …
Read More »
News Website (iasianews.net) I Asia News