crime

అనకాపల్లి “కెనరాబ్యాంక్” దోపిడీకి విఫలయత్నం

బ్యాంకు మేనేజర్ పై తుపాకీ గురిపెట్టిన భయపడని వైనం బ్యాంక్ మేనేజర్ అనసూయ సమయస్ఫూర్తితో దొంగలు పరార్ అనకాపల్లి ,ఐఏషియ న్యూస్: ఏకంగా బ్యాంకులోనే చోరీ చేసేందుకు ప్రయత్నించిన ఓ దొంగల ముఠాను ఆ బ్యాంక్ మహిళ మేనేజర్ అనసూయ విజయవంతంగా అడ్డుకున్నారు. ఏకంగా ఏడుగురు దొంగలు పట్టపగలు బ్యాంకులో కస్టమర్లు ఉండగానే చొరబడి బెదిరింపులకు దిగారు. బ్యాంక్‌ దోపిడీ చేసేందుకు విఫలయత్నం చేశారు. ఈ క్రమంలోనే బ్యాంక్ మేనేజర్ అనసూయ పాయింట్ బ్లాంక్‌లో తుపాకీ పెట్టి బెదిరించారు. అయితే ఆ బ్యాంక్ మేనేజర్ …

Read More »

10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ కామేశ్వరి

ఖమ్మం,ఐఏషియ న్యూస్: ఖమ్మం జిల్లా కారేపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ గా పనిచేస్తున్న ఉషా శుభ కామేశ్వరి గురువారం 10 వేలు లంచం తీసుకుంటు ఏసీబీకి పట్టుబడ్డారు.ల్యాండ్‌ మ్యుటేషన్‌ కోసం అవసరమైన ఫ్యామిలీ మెంబర్స్‌ సర్టిఫికేట్‌ కావాలని ఆర్‌ఐను సంప్రదించారు.ఈ పని చేయడానికి పదివేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు.దీంతో లంచం డిమాండ్‌ చేసిన ఆమెకు రూ.10 వేలు బాధితులు అందిస్తుండగా మాటు వేసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.ఆర్‌ఐపై కేసు నమోదు చేసుకుని వరంగల్‌ ఏసిబి జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. Authored by: Vaddadi …

Read More »

ఆకవలలలో ఒకరు ఎస్పీ మరొకరు ఏసిపి: పోలీస్ శాఖలో ఒక అద్భుతం

స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: కవలలు ఇద్దరూ సైంటిస్ట్ లు కావడం,ఇద్దరూ డాక్టర్లు కావడం లాంటి అద్భుతాలు ఎక్కువగా సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం. కానీ నిజజీవితంలో కూడా అలాంటి అద్భుతాలు జరుగుతుంటాయి. కవలలు ఇద్దరూ ఐపీఎస్ అధికారులు అయిన అద్భుతం ఇది. అరవిందన్ అనే ఐపీఎస్ అధికారి తన కవల సోదరుడు అభినందన్ తో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయగా అదికాస్తా నెటిజన్లని ఆశ్చర్యపరుస్తూ వైరల్ గా మారింది. ఇద్దరూ అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉన్నారు. ఇద్దరూ ఖాఖీ డ్రెస్సులో అదిరిపోయేలా ఫోజు ఇచ్చారు. …

Read More »

20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సర్వేయర్ శ్రీరాములు

పుంగనూరు,ఐఏషియ న్యూస్: చిత్తూరు జిల్లా పుంగనూరు తహసిల్దార్ కార్యాలయంలో బుధవారం రాత్రి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ. 20 వేలు లంచం తీసుకుంటూండగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా విలేజ్ సర్వేయర్ శ్రీరాములు పట్టుబడ్డాడు.మంగళం పంచాయతీలో 8గుంటల భూమి సర్వే కొరకు దరఖాస్తు చేసుకున్న ఉమాశంకర్,15 రోజుల క్రితం మంగళం సచివాలంలో సర్వే కొరకు దరఖాస్తు చేసుకున్నారు. సర్వే సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.50 వేలు ఒప్పందం కుదుర్చుకుని రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.నిందితుడు వద్ద నుంచి నగదు …

Read More »

మహిళా పోలీసు స్టేషన్ సందర్శించిన సిపి డా.శంఖబ్రత బాగ్చి

విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: నగరంలో లా అండ్ ఆర్డర్ అదుపులో ఉంచుతూ నగరం మొత్తం ప్రశాంతముగా ఉండేలా నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల నందు సిపిడాక్టర్.శంఖబ్రత బాగ్చి రెండవ విడత ఇన్స్పెక్షన్ లో భాగముగా బుధవారం మహిళా పోలీసు స్టేషన్ ఆకస్మిక తనికి నిర్వహించారు. పోలీసు స్టేషన్ ను సందర్శించిన సిపి పోలీస్ అధికారులు, సిబ్బంది విధులను సమీక్షించి, సిబ్బంది కి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్న సీపీ. స్టేషన్ రికార్డులు అన్నీ సక్రమముగా ఉన్నదీ లేనిదీ పరిశీలించి, సంబంధిత అధికారులకు …

Read More »

పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పూర్తి చేసిన ఏపీ ప్రభుత్వం

ఉద్యోగాలు పొందిన 5,757 మంది కానిస్టేబుళ్లకు 22 నుంచి ట్రైనింగ్ కార్యక్రమం మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ ప్రాంగణంలో ఎంపికైన కానిస్టేబుల్ తో సీఎం చంద్రబాబు అమరావతి,ఐఏషియ న్యూస్: పోలీసు శాఖలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియను కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది. గత ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలతో సరిపుచ్చిన కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిచేసింది. 6,100 మందిని రిక్రూట్ చేసుకునేందుకు నోటిఫికేషన్ ఇవ్వగా అందులో 6,014 మంది సెలక్ట్ అయ్యారు. వీరిలో 5,757 …

Read More »

తండ్రి ఆటో కింద పడి కూతురు మృతి

అనకాపల్లి,ఐఏషియ న్యూస్: విశాఖ ఎన్ఏడి నుండి మాకవరపాలెం అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ టెట్ పరీక్ష రాసేందుకు తండ్రి ఆటోలో వెళుతుండగా ఆటో అదుపుతప్పి ఆటోలో ఉన్న ఆటో డ్రైవర్ కుమార్తెసునీత (25) అక్కడికక్కడే మృతి చెందగా. తండ్రి లక్ష్మణరావు స్వల్ప గాయాలయ్యాయి మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసిన అనకాపల్లి ట్రాఫిక్ పోలీసులు. Authored by: Vaddadi udayakumar

Read More »

ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా 15 మంది దుర్మరణం

మారేడుమిల్లి,ఐఏషియ న్యూస్: రెండు తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు బెంబేలెత్తిస్తోన్నాయి. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 15 మందికి పైగా ప్రయాణికులు దుర్మరణం పాలైనట్లు సమాచారం. పలువురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేట్ బస్సు అది. అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాదానికి గురైంది. చింతూరు- మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో అదుపు తప్పి లోయలో పడింది.ఈ సమాచారం అందిన …

Read More »

ఏపీ ఫైబర్ నెట్ కేసు కొట్టేసిన ఏసీబీ కోర్టు

అమరావతి,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి బిగ్ రిలీఫ్ దక్కింది. గత వైసీపీ ప్రభుత్వం సమయంలో ఏపీ ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌లో అవినీతి జరిగిందంటూ ఆయనపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్ గా ఆ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా ఈ కేసులో చంద్రబాబుతో పాటు మిగిలిన వారికి క్లీన్‌చిట్‌ ఇచ్చింది.దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.కాగా 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌లో …

Read More »

పెందుర్తిలో 13 ఏళ్ల బాలిక అదృశ్యం

పెందుర్తి(విశాఖపట్నం),ఐఏషియ న్యూస్: విశాఖపట్నం సిటీ, పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప కాలనీ జె ఎన్ ఎన్ యు ఆర్ ఎమ్ హౌస్‌లో నివసించే తాడి సంధ్య (13) అనే బాలిక గత సెప్టెంబర్ 23న తన అత్త నరవ వెంకటలక్ష్మి ఇంటిలో ఉంటూ, సక్రమంగా ఇంటి పనులు చేసుకోవాలని ఆమె మందలించడంతో, అదే రోజు ఉదయం 10.00 నుండి 11.00 గంటల మధ్యలో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి బయటికి వెళ్లి ఎక్కడికో వెళ్లిపోయింది. తిరిగి ఇంటికి రాలేదు. ఇంటి పరిసరాల్లో, బంధువుల …

Read More »