
ఇంటినంబర్ కేటాయింపునకు లంచం డిమాండ్
నిజామాబాద్,ఐఏషియ న్యూస్: తన డ్రైవర్ ద్వారా ఓ వ్యక్తి నుంచి రూ.20వేలు డిమాండ్ చేసిన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు.ఈ నేపథ్యంలో గురువారం కమిషనర్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.డ్రైవర్ భూమేశ్ బ్యాగ్ తనిఖీ చేయగా అతనివద్ద నుంచి లెక్కల చూపని నాలుగు లక్షల30వేల రూపాయలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కమిషనర్ తో పాటు డ్రైవర్ పై కూడా కేసు నమోదు చేసి వారిద్దరిని అరెస్టు చేసి ఏసీబీ కోర్టుకు తరలించారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News