పుంగనూరు,ఐఏషియ న్యూస్: చిత్తూరు జిల్లా పుంగనూరు తహసిల్దార్ కార్యాలయంలో బుధవారం రాత్రి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ. 20 వేలు లంచం తీసుకుంటూండగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా విలేజ్ సర్వేయర్ శ్రీరాములు పట్టుబడ్డాడు.మంగళం పంచాయతీలో 8గుంటల భూమి సర్వే కొరకు దరఖాస్తు చేసుకున్న ఉమాశంకర్,15 రోజుల క్రితం మంగళం సచివాలంలో సర్వే కొరకు దరఖాస్తు చేసుకున్నారు. సర్వే సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.50 వేలు ఒప్పందం కుదుర్చుకుని రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.నిందితుడు వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకుని ఏసిబి కోర్టుకు తరలించారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News