హైదరాబాద్,ఐఏషియ న్యూస్: శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేటలోని ఎయిర్ఫోర్స్ శిక్షణ కేంద్రానికి ప్రత్యేక విమానం ద్వారా చేరుకున్న ఆమెకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, సీతక్క తదితరులు స్వాగతం పలికారు. 18న నిలయంలో విశ్రాంతి తీసుకుంటారు. 19న రామోజీ ఫిల్మ్సిటీలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలకు హాజరవుతారు. 20న గచ్చిబౌలిలో బ్రహ్మకుమారీస్ శాంతిసరోవర్ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాల్గొంటారు. 21న నిలయంలో నిర్వహించే పౌరుల భేటీ, ఎట్ హోమ్లో పాల్గొంటారు. 22న సాయంత్రం ప్రత్యేక విమానంలో దిల్లీకి బయలుదేరుతారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News