విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖ పూర్ణమార్కెట్లో సోమవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆకస్మికంగా చెలరేగిన ఈ మంటలు వలన మార్కెట్ ఉన్న ఆరు పూజ సామాగ్రి షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలని అదుపు చేశారు. ప్రమాదం అర్ధరాత్రి జరగడంతో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వన్ టౌన్ పోలీసులు సేకరిస్తున్నారు. ఆస్తినష్టం ఎంత జరిగిందన్నది తెలియాల్సి ఉంది.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News