శ్రీశైలం,ఐఏషియ న్యూస్: శ్రీశైల దేవస్థానంలో బుధవారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి గత 27 రోజులు సంబంధించి రూ.4,51,62,522 నగదు లభించిందని ఈఓ ఎం శ్రీనివాసరావు తెలిపారు. అంతేకాకుండా హుండీలో 164 గ్రాముల 500 మిల్లీ గ్రాముల బంగారు, 5 కేజీల 840 గ్రాముల వెండిలభించాయని వివరించారు.598 – యుఎస్ఏ డాలర్లు, 100 – న్యూజిలాండ్ డాలర్లు, 100– సింగపూర్ డాలర్లు, 10 – ఇంగ్లాండు ఫౌండ్స్, 100 – ఈరోస్, 300 – ఓమన్ బైసా, 20 – కెనడా డాలర్లు, 1- కువైట్ దినార్, 115- సౌదీ అరేబియా రియాల్స్, 102 – కత్తార్ రియాల్స్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయన్నారు. హుండీల లెక్కింపులో కార్యనిర్వహణాధికారి యం.శ్రీనివాసరావు,డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఆర్.రమణమ్మ, పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar