విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ , విజయవాడ ఆధ్వర్యంలో రాబోయే 20వ తేదీన 186వ ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవం సందర్భంగా కండక్ట్ చేసిన జాతీయ ఫోటోగ్రఫి 2025 పోటీలలో, స్పాట్ న్యూస్,జనరల్ విభాగాలలో అవార్డులు గెలుపొందిన వైజాగ్ ఫోటో జర్నలిస్ట్స్. ఈ అవార్డు పొందిన వారిలో విశాఖకు చెందిన కె ఆర్ దీపక్ ది హిందూ, వై.రామకృష్ణ ఆంధ్రజ్యోతి, పి ఎల్ మోహన్ సాక్షి, ఏ శరత్ కుమార్ టైమ్స్ అఫ్ ఇండియా, వి రాజు ది హిందూ, పి ఎన్ మూర్తి డెక్కన్ క్రానికల్, జి సత్యనారాయణ న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్, ఎండి నవాజ్ సాక్షి ఉన్నారు. వీరికి పలువురు జర్నలిస్టులు అభినందనలు తెలియజేశారు.
Authored by: Vaddadi udayakumar