అమరావతి,ఐఏషియ న్యూస్: వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు. పార్టీలతో సంబంధం లేకుండా అందరు ఎమ్మెల్యేల మాదిరిగానే మాట్లాడేందుకు సమయం ఇస్తామన్నారు.రాష్ట్రంలోని సమస్యలతో పాటు తమతమ నియోజకవర్గాల్లోని ప్రజలకు సంబంధించి అన్ని ఇష్యూలపై చర్చించేందుకు టైం ఇస్తామన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని, ప్రభుత్వానికి సహకరించాలన్నారు.స్పీకర్ అయ్యన్న సూచనలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
Authored by: Vaddadi udayakumar