విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి 234 బటాలియన్ సి ఆర్ పి ఎఫ్, విశాఖపట్నం, బక్కన్న పాలెం వద్ద సి అర్ పి ఎఫ్ ఐ జి విపుల్ కుమార్ ని గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఇద్దరు ఉన్నతాధికారులు ఎల్ డబ్ల్యు ఈ పరిస్థితులు, భద్రతా చర్యలు, సంయుక్త ఆపరేషన్ల సమన్వయం, సిబ్బంది సంక్షేమ కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు.సభ్యసమాజ భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్ర పోలీస్, సిఆర్పిఎఫ్ పరస్పర సహకారం మరింత బలోపేతం చేయాలని అభిప్రాయపడ్డారు.సమావేశం ముగింపు సందర్భంగా, డీఐజీ సి అర్ పి ఎఫ్ ఐ జి కి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News