నిజాయితీని నిరూపించుకున్న బాలుడు

 

గుంటూరు,ఐఏషియ న్యూస్: గుంటూరు పట్టణానికి చెందిన కటికం భారతి అను మహిళ సోమవారం ఉదయం మంగళగిరి పట్టణంలోని ఎయిమ్స్ హాస్పిటల్ కు వచ్చి మంగళగిరి కొత్త బస్టాండ్ దగ్గర తన పర్స్ పోగొట్టుకొని పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన అనంతరం కొద్దిసేపటికి ఆమె పర్సు దొరికింది. ఈ నేపథ్యంలో ఒక బాలుడు నిజాయితీగా ఆ యొక్క పర్సు తీసుకుని వచ్చి మంగళగిరి పట్టణ పోలీసు స్టేషన్ యందు సిఐని కలిసి జరిగిన వాస్తవాలు తెలియపరచగా అందులో ఫిర్యాది కటికం భారతి చెప్పిన విధంగా బంగారు చెవి జోడుజత, నాలుగు వేల ఒక వంద నగదు రెండు ఏటీఎం కార్డులు ఉన్నాయి. అంతట సదరు బాధితురాలు తన యొక్క పర్సు పరిశీలించుకుని ఎంతో సంతోషించి సదరు కుర్రవాడికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీ కె వీరాస్వామి సదరు కుర్రవాడిని అభినందించి నీలాగే అందరూ ఇదే విధంగా నిజాయితీగా ఉండాలని ప్రశంసించారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో పెన్ డ్రైవ్,వాట్సాప్ సర్వీసులు నిషేధం

శ్రీనగర్ ,ఐఏషియ న్యూస్:  అన్ని ప్రభుత్వ శాఖల్లో కార్యాలయాల్లో పెన్‌డ్రైవ్‌లు, వాట్సాప్ సర్వీసులపై నిషేధం విధిస్తున్నట్లు జమ్మూ కాశ్మీర్‌లోని ఒమర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *