కరూర్‌ మృతులకు 20 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన విజయ్

చెన్నై,ఐఏషియ న్యూస్: టీవీకే విజయ్‌ కార్నర్‌ మీటింగ్‌లో తొక్కిసలాట 30 మంది మృతి, మరో 50 మంది పరిస్థితి విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. వినాపద్యంలో ఈ సంఘటనలో మృతి చెందిన వారికి 20 లక్షల గాయపడ్డ వారికి 2 లక్షల రూపాయలు నష్టపరిహారాన్ని విజయ్ ప్రకటించారు. బాధితులకు తాము అండగా ఉంటామని ఈ సందర్భంగా విజయ్ పేర్కొన్నారు.
10 లక్షల నష్టపరిహారం ప్రకటించిన తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం
కరూర్ తొక్కిసలాట లో మృతులకు 10 లక్షలు ఎక్స్ గ్రేషియా తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. గాయపడ్డ వారికి లక్ష రూపాయలు నష్టపరిహారం అందజేయనున్నారు.ఈ మేరకు సీఎం స్టాలిన్ ఒక ప్రకటన విడుదల చేశారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చిట్యాల తహసిల్దార్

చిట్యాల (నల్లగొండ),ఐఏషియ న్యూస్: నల్లగొండ జిల్లాలోని చిట్యాల మండల తహశీల్దార్ గుగులోతు కృష్ణ లంచం తీసుకుంటూ గురువారం తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *