ఏపీ గ్రామ పంచాయతీల్లో కీలక సంస్కరణలు

 

 

 

 

ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఏపీలో ఉన్న గ్రామ పంచాయతీల్లో కీలక సంస్కరణలు చేపట్టేందుకు వీలుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో గ్రామపంచాయతీల పునర్ వ్యవస్దీకరణ, సిబ్బంది కూర్పు, కార్యదర్శుల పదవుల వర్గీకరణ, ప్రమోషన్లు వంటి పలు నిర్ణయాలు ఉన్నాయి. వీటిని తక్షణం అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించనున్నారు.ఇప్పటికే కేబినెట్ లో ఆమోదించిన ఈ నిర్ణయాలు క్షేత్రస్దాయిలో అమలు చేయనున్నారు.రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పునర్ వర్గీకరణకు ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు గ్రామ పంచాయతీల్లో సిబ్బంది కూర్పు ఖరారు చేసింది. దీని ప్రకారం ఇప్పటివరకూ ఐదు కేటగిరీలుగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల్ని మూడు కేటగిరీలకు కుదించారు.ఈ మూడు కేటగిరీలు కాకుండా మిగిలిపోయిన పంచాయతీ కార్యదర్శుల్ని రూర్పన్ పంచాయతీలు, గ్రేడ్ 1 పంచాయతీల్లో వాడుకోవాలని ఉత్తర్వులు ఇచ్చారు.ప్రస్తుతం ఉన్న 7,244 గ్రామ పంచాయతీల క్లస్టర్ వ్యవస్థను రద్దు చేయడంతో పాటు 13,351 గ్రామ పంచాయతీలలో ప్రతి ఒక్కటి స్వతంత్ర పరిపాలనా విభాగంగా పరిగణించాలనినిర్ణయించారు. 13,351 గ్రామ పంచాయతీలను 4 గ్రేడ్‌లుగా తిరిగి వర్గీకరించడానికి అంటే రూర్బన్ పంచాయతీ (359), గ్రేడ్-I (3082), గ్రేడ్-II (3163) మరియు గ్రేడ్-III (6747) పంచాయతీలుగా ఆమోదించారు.359 రూర్బన్ పంచాయతీలలో నియమించడానికి డిప్యూటీ మండల్ పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ కేడర్‌లో రూ.44570-127480/- వేతన స్కేల్‌లో ఉన్న గ్రేడ్-I పంచాయతీ కార్యదర్శి పోస్టులను రూ.45830-130580 వేతన స్కేల్‌లో రూర్బన్ పంచాయతీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (PDO)గా అప్‌గ్రేడ్ చేశారు. మిగిలిన పంచాయతీ కార్యదర్శుల పోస్టులను హేతుబద్ధీకరించి, ఐదు ప్రస్తుత గ్రేడ్‌లను మూడు గ్రేడ్‌లుగా విలీనం చేయడం ద్వారా తిరిగి సర్దుబాటుచేస్తారు.అంటేగ్రేడ్-I(రూ.44570-127480) గ్రేడ్-II(రూ.32670-101970),గ్రేడ్-III(రూ.28280-89720),అలాగే పంచాయతీ కార్యదర్శి పదవి పేరును పంచాయతీ అభివృద్ధి అధికారిగా మార్పు చేశారు. పంచాయతీ కార్యదర్శుల విలీనానికి ముందే ఖాళీల భర్తీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

అలాగే ప్రస్తుతం అందుబాటులో ఉన్న డిజిటల్ అసిస్టెంట్లతో పంచాయతీ శాఖలో ప్రత్యేక ఐటీ విభాగం ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. మరోవైపు రాష్ట్రంలో నేరుగా నియమితులైన డిప్యూటీ ఎంపీడీవోల్ని పీడీవోలుగా నియమించాలని నిర్ణయించారు. అలాగే ఇంటర్ క్యాడర్ ప్రమోషన్లకు ట్రైనింగ్ తప్పనిసరి చేశారు. ఇందులో రెండు వారాల అంతర్గత శిక్షణతో పాటు ఏడాది క్షేత్రస్ధాయిలో జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. మరోవైపు రాష్ట్రంలో 359 మంది జూనియర్ అసిస్టెంట్లు,జూనియర్ అసిస్టెంట్లు కమ్ బిల్ కలెక్టర్లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.మినిస్టీరియల్, కార్యనిర్వాహక సిబ్బంది ఇద్దరికీ సమాన అవకాశం కల్పించడానికి సంబంధిత సర్వీస్ నియమాలను సవరించాలని ఆదేశాలు ఇచ్చారు. పంచాయతీల్లో సిబ్బంది వారి విధులతో పాటు, భవన నిర్మాణ అండ్ లేఅవుట్ నియమాల అమలు మొదలైన వృత్తిపరమైన సేవలను అందించడానికి, మిగులు పోస్టుల విస్తరణ,ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లను సూచిక సిబ్బంది నమూనా ప్రకారం కంట్రీ ప్లానింగ్ అసిస్టెంట్‌గా ఉపయోగించుకోవచ్చని తెలిపారు.గ్రామ పంచాయతీలలో సేవలను సమర్థవంతంగా అందించడానికి గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ల నుండి ఖర్చును భరించడానికి లోబడి, గ్రామ పంచాయతీలలో పారిశుధ్య విభాగం,నీటి సరఫరా విభాగం,దేశ ప్రణాళిక విభాగం,వీధి దీపాలు , ఇంజనీరింగ్ విభాగం, రెవెన్యూ విభాగాలతో కూడిన సూచిక సిబ్బంది నమూనాను ఆమోదించారు.దీనిపై విడిగా ఉత్తర్వులు ఇవ్వనున్నారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

Meet and Greet “Nari Shakti” Smt.Madhavi Latha Kompella at Sri Siva Vishnu Temple, New Jersey,USA

న్యూజెర్సీలోని శ్రీ శివ విష్ణు దేవాలయం ప్రాంగణంలో సాయి దత్త పీఠం & సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో ఆధ్యాత్మికంగా ఉత్తేజకరమైన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *