విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: కింగ్ జార్జ్ ఆసుపత్రికి (కేజిహెచ్) డివిస్ ల్యాబొరేటరీస్ వారు సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా రూ.2.50 లక్షల విలువైన 3 సీటర్ల 25 రోచైర్లు మంగళవారం విరాళంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో కేజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి, సిఎస్ఆర్ఎమ్ఓ డాక్టర్ ఉ. శ్రీహరి, రేడియేషన్ ఆంకాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్.డాక్టర్.శ్రీనివాస్ పాల్గొన్నారు.సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి దివిస్ ల్యాబొరేటరీస్ వారి ఉదార సహకారానికి ధన్యవాదాలు తెలియజేస్తూ,ఈ చైర్లు ఆసుపత్రి రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News