చెన్నై-హైదరాబాద్ బుల్లెట్ రైలు: 2.20 గంటల్లో గమ్యం

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: చెన్నై-హైదరాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ రైలును తిరుపతి మీదుగా నడిపేందుకు సవరించిన నివేదికను తమిళనాడు ప్రభుత్వానికి అందజేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే, 778 కిలోమీటర్ల దూరం కేవలం 2 గంటల 20 నిమిషాల్లో ప్రయాణించవచ్చు. ప్రస్తుతం 12 గంటలు పట్టే ప్రయాణం గణనీయంగా తగ్గుతుంది. తమిళనాడులో 223.44 హెక్టార్ల భూమి అవసరమని నివేదిక పేర్కొంది. చెన్నై సెంట్రల్, మీంజూరు వద్ద కొత్త స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణ వేళల మార్పు

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖపట్నం-లింగంపల్లి మధ్య నడిచే జన్మభూమి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (12805/12806) రైళ్ల ప్రయాణ వేళల్ని ద.మ.రైల్వే మార్చింది. కొత్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *