ఆఫ్‌లైన్ శ్రీ‌వాణి టికెట్ల జారీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన టిటిడి

తిరుమల,ఐఏషియ న్యూస్: తిరుమల శ్రీవాణి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తుల ర‌ద్దీ కార‌ణంగా ఈనెల 27, 28, 29 (శ‌ని, ఆది, సోమ‌వారం) రోజుల్లో ఆఫ్‌లైన్ శ్రీ‌వాణి టికెట్ల జారీని రద్దు చేస్తున్నట్లు టీటీడీ గురువారం ప్రకటించింది. గురువారం రోజున సర్వదర్శనం ద్వారా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు 30 గంటల కంటే ఎక్కువ సమయం పడుతోంది. తిరుమలలోని శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్లతోపాటు తిరుపతి రేణిగుంట ఎయిర్‌పోర్టులో కూడా శ్రీవాణి ఆఫ్‌లైన్ టికెట్లు జారీ చేయబడవని టీటీడీ తెలిపింది.వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లతోపాటు నారాయణగిరి షెడ్లు. శ్రీవారి భక్తులతో పూర్తిగా నిండిపోయాయి.దీంతో శిలాతోరణం వరకు క్యూలైన్లలో భక్తులు భారీ ఎత్తున వేచి ఉన్నారు. వారిని కట్టడి చేయడం ఇప్పుడు టీటీడీ సిబ్బందికి కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలోనే సోమవారం వరకు ఇలాంటి రద్దీ పరిస్థితులే ఉండే అవకాశాలు ఉన్నాయనే అంచనాలతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇక భక్తుల రద్దీ అధికం కావడంతో క్యూలైన్‌లోకి భక్తులను అనుమతించడం నిలిపేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు తిరిగి భక్తులను క్యూ లైన్‌లోకి అనుమతించనున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు.. కొండ కింద అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భారీగా వాహనాలు బారులు తీరినట్లు తెలియజేశారు.
లగేజీ కేంద్రాల నుంచి అలిపిరి లింకు బస్టాండ్ వరకు వాహనదారులు గంటల పాటు వేచిచూస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు.. శ్రీవారి సర్వదర్శన టోకెన్లను పొందేందుకు.. తిరుపతిలో శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్‌ వద్ద భారీగా భక్తులు పడిగాపులు కాస్తున్నారు. ఒక రోజుకు కేవలం 8,000 టోకెన్లను మాత్రమే అధికారులు రిలీజ్ చేస్తున్నారు. కానీ భక్తులు మాత్రం 30 వేల మందికి పైగా తరలి రావడంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

టోకెన్ ఉన్న భక్తులకే శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు

టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు ప్రకటన తిరుమల,ఐఏషియ న్యూస్: శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఈనెల 30 నుంచి జనవరి 1 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *