ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆత్మీయ వీడ్కోలు

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖ జిల్లాలో సీఐఐ పార్ట్నర్ షిప్ సమ్మిట్-2025 కార్యక్రమాలలో పాల్గొనేందుకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ తో కలిసి,ఉండవల్లి, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లాకు తిరుగు పయనమయ్యారు.ఈ సందర్భంగా ప్ర‌జాప్ర‌తినిధులు, జిల్లా అధికారులు శనివారం రాత్రి ఆత్మీయ వీడ్కోలు పలికారు.ముఖ్యమంత్రికి విశాఖ ఎయిర్ పోర్టులో వీడ్కోలు పలికిన వారిలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి డా.డోలా శ్రీ‌ బాల వీరాంజనేయ స్వామి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయనంద్,ప్ర‌భుత్వ విప్ గ‌ణ‌బాబు, శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, సుందరపు విజయకుమార్, జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్,ఇతర అధికారులు పాల్గొన్నారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

రౌడీయిజం చేస్తే “రాష్ట్ర బహిష్కరణ” చేస్తా

ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని కొందరు రాజకీయ ముసుగులో ఉండే రాజకీయం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *