అరకులోయ,ఐఏషియ న్యూస్: శీతాకాలంలో అరకు అందాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అటువంటి అరకు వెళ్లే పర్యాటకులు నూతన సంవత్సర వేడుకల వేళ కూడా అరకు అందాలను చూడడానికి వెళుతూ ఉంటారు. ఈ క్రమంలో పర్యాటకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అరకు వెళ్లే పర్యాటకులకు శుభవార్త చెప్పింది. విశాఖ కిరండోల్ రైలుకు అదనపు బోగీ ఏర్పాటు పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మెరుగైన సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేస్తున్న రైల్వే శాఖ నిర్ణయాన్ని తీసుకుంది. విశాఖపట్నం – కిరండోల్ …
Read More »Travels
ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త
విజయవాడ,ఐఏషియ న్యూస్: ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీఎస్ఆర్టీసీలో పలు సంస్కరణలు తీసుకువస్తున్న ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.మెడికల్ అన్ఫిట్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా తీపికబురు వినిపించింది. మెడికల్ అన్ఫిట్ అయిన అర్టీసీ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మేరకు శుక్రవారం రోజున ఉత్తర్వులు కూడా జారీ చేసిందని ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలియజేశారు. శుక్రవారం ఆయన …
Read More »రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
ఉత్తరప్రదేశ్ (షాజహాన్పూర్) ,ఐఏషియ న్యూస్: తప్పు అని తెలిసినా.. కొంత మంది చేసే నిర్లక్ష్యం ప్రాణాలకు ముప్పు తెస్తుంది. ఒక చిన్న తప్పువల్ల కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉత్తర్ప్రదేశ్లోని షాజహాన్పూర్లో రైల్వే ట్రాక్ దాటుతుండగా మోటార్ సైకిల్ను ప్యాసింజర్ రైలు ఢీ కొట్టడంతో ఒకే కుటుంబానికి చెదిన ఐదుగురు అక్కడిక్కడే మృతిచెందారు. రౌజా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. లక్నో వైపు నుంచి వస్తున్న ప్యాసింజర్ రైలు మోటర్ వెహికిల్ గేట్ దాటుతున్న సమయంలో ఢీకొట్టింది. …
Read More »హెచ్1బీ వీసా పొందాలంటే అక్టోబరు దాకా ఎదురుచూపులు తప్పవా?
ఆందోళన చెందుతున్న భారతీయ దరఖాస్తుదారుడు వాషింగ్టన్,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: అమెరికా ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సోషల్ మీడియా ఖాతాల పరిశీలన పాలసీ వల్ల భారత హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు కష్టకాలం ఎదురైంది. ఈ విధానం వల్ల వీసా కోసం దరఖాస్తు చేసిన వారు ఇక నెలల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎదురయింది. పలువురు దరఖాస్తుదారుల వీసా అపాయింట్మెంట్లు 2026 అక్టోబరు నెలాఖరుకూ వాయిదా పడినట్లు ఆంగ్ల మీడియా కథనాలు ద్వారా భారతీయులు తెలుసుకుని తీవ్ర అసౌకర్యం కలిగిందని ఆందోళన చెందుతున్నారు. అమెరికా ప్రభుత్వ నిర్ణయం …
Read More »విజయవాడ రద్దీ తగ్గించేందుకు గొల్లపూడి సాటిలైట్ రైల్వే స్టేషన్ ఏర్పాటు ప్రతిపాదన
రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి విజయవాడ ఎంపీ కేసినేని న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఆసియా ఖండంలోనే అతిపెద్ద రైల్వే జంక్షన్లలో ఒకటైన విజయవాడ స్టేషన్ పై రైళ్ల రద్దీ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దీంతో పలు ప్రత్యామ్నాయాలు తెరపైకి వస్తున్నా ఇప్పటికీ కార్యరూపం దాల్చడం లేదు. ఆలోపు మరికొన్ని కొత్త ప్రతిపాదనలు వస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే తాజాగా అమరావతి రైల్వే జంక్షన్ ప్రతిపాదన కూడా వచ్చింది. దీంతో కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇలాంటి సమయంలో విజయవాడ రైల్వే జంక్షన్ పై …
Read More »ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా 15 మంది దుర్మరణం
మారేడుమిల్లి,ఐఏషియ న్యూస్: రెండు తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు బెంబేలెత్తిస్తోన్నాయి. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 15 మందికి పైగా ప్రయాణికులు దుర్మరణం పాలైనట్లు సమాచారం. పలువురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేట్ బస్సు అది. అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాదానికి గురైంది. చింతూరు- మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో అదుపు తప్పి లోయలో పడింది.ఈ సమాచారం అందిన …
Read More »జన్మభూమి ఎక్స్ప్రెస్ ప్రయాణ వేళల మార్పు
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖపట్నం-లింగంపల్లి మధ్య నడిచే జన్మభూమి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (12805/12806) రైళ్ల ప్రయాణ వేళల్ని ద.మ.రైల్వే మార్చింది. కొత్త వేళలు ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వస్తాయని జోన్ సీపీఆర్వో ఏ.శ్రీధర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం-లింగంపల్లి(12806)రైలువిశాఖపట్నంలో ఉదయం 6.20కి బయల్దేరి, లింగంపల్లికి రాత్రి 7.15కి చేరుకుంటుంది. లింగంపల్లి-విశాఖపట్నం(12805) రైలు ఉదయం 6.55కి లింగంపల్లి నుంచి బయల్దేరి, విశాఖపట్నంకు రాత్రి 7.50కి చేరుకుంటుంది.ఈ మారిన వేళలను ప్రయాణికులు గమనించాలని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. Authored by: Vaddadi udayakumar
Read More »బ్లూబర్డ్ ఉపగ్రహ ప్రయోగం 21కి వాయిదా
తిరుపతి,ఐఏషియ న్యూస్: ఇస్రో చేపట్టనున్న వాణిజ్య ఉపగ్రహ ప్రయోగం ‘బ్లూబర్డ్’ వాయిదా పడినట్టు తెలిసింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి ఎల్వీఎం3-ఎం6 రాకెట్ ప్రయోగం ద్వారా బ్లూబర్డ్ ఉపగ్రహాన్ని తొలుత ఈనెల 17న ప్రయోగించనున్నట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి. అయితే రాకెట్ అనుసంధానంఆలస్యం కావడంతో ఈ ప్రయోగం ఈ నెల 21కి వాయిదా పడినట్లు ఇస్రో వర్గాల సమాచారం. షార్లోని రెండో వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్లో రాకెట్ అనుసంధాన పనులు జరుగుతున్నాయి. అన్నీ సజావుగా సాగితే ఈ …
Read More »తెలంగాణలో “మహిళల ఉచిత బస్సు” ప్రయాణానికి రెండేళ్లు పూర్తి
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమై నేటికి (డిసెంబర్ 9) సరిగ్గా రెండు సంవత్సరాలు పూర్తయ్యింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో.. 2023 డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ప్రారంభించిన ఈ పథకం మహిళా సాధికారతకు గొప్ప మార్గంగా నిలిచింది. ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళలకు, ఆర్టీసీ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా అనుహ్య స్పందనను దక్కించుకుంది. తొలి రోజుల్లో …
Read More »నేటి అర్ధరాత్రి నుండి గూడ్స్ ట్రాన్స్ పోర్ట్ బంద్
విజయవాడ,ఐఏషియ న్యూస్: రాష్ట్రంలో సరుకు రవాణా నిలిచిపోనుంది. లారీల యాజమానుల సంఘం అల్టిమేటం జారీ చేసింది. 13 ఏళ్లు దాటిన వాహనాలపై మోపిన ఈ అదనపు భారాన్ని వెంటనే ఉపసంహరించు కోకపోతే ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక నిరసనకు దిగాలని లారీ ఓనర్స్ అసోసి యేషన్ నిర్ణయం తీసుకుంది. సమ్మె జరిగితే నిత్యావసరాల నుంచి అన్నింటి పైనా ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. దీంతో, ఇప్పుడు రవాణా శాఖ తీసుకునే నిర్ణయం కీలకం కానుంది.లారీల యాజమానుల సంఘం కీలక ప్రకటన …
Read More »
News Website (iasianews.net) I Asia News