
ఆందోళన చెందుతున్న భారతీయ దరఖాస్తుదారుడు
వాషింగ్టన్,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: అమెరికా ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సోషల్ మీడియా ఖాతాల పరిశీలన పాలసీ వల్ల భారత హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు కష్టకాలం ఎదురైంది. ఈ విధానం వల్ల వీసా కోసం దరఖాస్తు చేసిన వారు ఇక నెలల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎదురయింది. పలువురు దరఖాస్తుదారుల వీసా అపాయింట్మెంట్లు 2026 అక్టోబరు నెలాఖరుకూ వాయిదా పడినట్లు ఆంగ్ల మీడియా కథనాలు ద్వారా భారతీయులు తెలుసుకుని తీవ్ర అసౌకర్యం కలిగిందని ఆందోళన చెందుతున్నారు. అమెరికా ప్రభుత్వ నిర్ణయం పై భారత ప్రభుత్వం స్పందించాలని పలువురు దరఖాస్తుదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News