విజయవాడ,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి కృష్ణ మోహన్ , సతీమణి కుటుంబ సభ్యులతో కలిసి కనకదుర్గ గుడికి విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయానికి చేరుకున్న వారికి కార్యనిర్వహణాధికారి వి.కె. సీనా నాయక్ స్థానాచార్య వి.శివప్రసాద్ ఘనస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
అనంతరం వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రం ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో వారిని గౌరవించి, జ్ఞాపికను బహుకరించారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News