empolyment

నర్సీపట్నం అమ్మాయి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం గురువారం బదిలీ చేసిన 12 మంది జిల్లా కలెక్టర్ లలో కీర్తి చేకూరి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా నియమితులయ్యారు.ఈమె అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం కోటవురట్ల తంగేడు గ్రామానికి చెందినవారు. నర్సీపట్నం ఆర్.సి.యం పాఠశాలలో విద్యనభ్యసించారు.బీటెక్ మెటలర్జీ ఐఐటి (మద్రాస్)లో చేశారు. మొదట ఐఆర్ఎస్ అధికారిగా కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. అయినప్పటికీ ఐఏఎస్ చేయాలన్న పట్టుదలతో రెండుసార్లు తక్కువ ర్యాంకు వచ్చినప్పటికీ మూడోసారి పరీక్షలు రాసి ఆల్ ఇండియా 14వర్యాంక్ సాధించారు.కాకినాడ జాయింట్ కలెక్టర్, …

Read More »

విజయవాడలో ఆటో డ్రైవర్ల భారీ ర్యాలీ: 25వేలు వడ్డీ లేని రుణం ఇవ్వాలని డిమాండ్

విజయవాడ,ఐఏషియ న్యూస్: ఏపీలో కూటమి సర్కార్ సూపర్ సిక్స్ ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఈనెల 15 నుంచి అందుబాటులోకి తెచ్చింది. దీంతో మహిళలు సంతోషంగా ఉన్నా ఈ పథకం ప్రభావం ఆటో డ్రైవర్లపై తీవ్రంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆటోడ్రైవర్లుతమను ఆదుకోవాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఉచిత బస్సు పథకం నేపథ్యంలో తమకు కొత్తపథకం అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపిస్తూ మంగళవారం విజయవాడలో ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ చేపట్టారు.బడా పారిశ్రామికవేత్తలకు రాయితీలు …

Read More »

సీడాప్ ద్వారా 5 ఏళ్లలో 50వేల మందికి విదేశీ ఉద్యోగాలు లక్ష్యం

అమరావతి,ఐఏషియ న్యూస్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీడాప్, ఓంక్యాప్ బలోపేతంపై దృష్టిసారించామని, సీడాప్ ద్వారా రాబోయే అయిదేళ్లలో ఇతర దేశాల్లో 50వేలమందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సొసైటీ ఫర్ ఎంప్లాయ్ మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ ప్రైజ్ డెవలప్ మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (సీడాప్ ), ఇండో యూరో సింక్రనైజేషన్ అండ్ జర్మన్ హెల్త్ కేర్ సంయుక్త భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్లేస్ మెంట్ పథకం (నర్సింగ్ ప్రొఫెషనల్స్) కింద …

Read More »

ఉద్యోగి కుటుంబానికి చేయూత: లక్ష ఆర్థిక సహాయం అందజేత

సమాచార శాఖ కమిషనర్ చావలి సునీల్ దాతృత్వం మంగళగిరి,ఐఏషియ న్యూస్: ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నా, సహాయం చేసే గుణం ఉండటమే అన్నింటికీ మించిన ఆస్తి అన్న చందాన సమాచార శాఖ కమిషనర్ చావలి సునీల్ దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు. సమాచార శాఖ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి చనిపోగా, సదరు ఉద్యోగి కుటుంబ దిన స్థితిని గమనించిన సమాచార కమిషనర్ స్పందించి, తన నెల వారి జీతం నుంచి రూ. లక్ష ఆర్థిక సహాయంగా అందజేశారు. వివరాల్లోకి వెళితే.అంబేద్కర్ కోనసీమ జిల్లా, పుల్టేటికూరు గ్రామానికి చెందిన …

Read More »

ఏఐ డేటా కోర్సుకు ఆన్లైన్ శిక్షణ: దరఖాస్తు ఆహ్వానం

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: డిమాండ్ కు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అర్హత ఉన్న వారికి ఆన్ లైన్ లో ఏఐ కోర్సుల శిక్షణ ఇచ్చేందుకు సంస్థలు ముందుకు వచ్చాయి. దరఖాస్తుల ను ఆహ్వానిస్తున్నాయి.నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో ఏఐ కంప్యూటర్ సాఫ్ట్వేర్ కోర్సుల్లో ఆన్లైన్ శిక్షణ ఇవ్వనుంది. సైబర్ సెక్యూరిటీ, ఏఐ డేటా సైన్స్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, ఎథికల్ హ్యాకింగ్, పైథాన్, మెషిన్ లెర్నింగ్ మరియు బిజినెస్ అనలిటిక్స్ ఉన్నాయి. అదనపు కోర్సులలో ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, బ్లాక్‌చెయిన్, డీప్ లెర్నింగ్, …

Read More »

మూడు నెలల్లోగా ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి

రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు విజ్ఞప్తి అమరావతి,ఐఏషియ న్యూస్:  ఏపీలో ఉద్యోగులకు చెల్లించాల్సి బకాయిల పైన చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరాయి. ఉద్యోగులు, పెన్షర్ల ఆర్థిక, ఆర్థికేతర సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేసాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ ప్రకటించాలని,12వ పిఆర్సీ కమీషన్ తక్షణమే నియమించాలని కోరుతున్నాయి. తక్షణమే పెండింగ్ డిఏలు విడుదల చేయాలని సంఘాల నేతలు కోరారు. మూడు నెలల్లోగా వీటి చెల్లింపు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని సంఘాలు …

Read More »

దొంగ మస్తర్లతో ఉపాధి హామీలో నిధులు గోల్ మాల్

అనకాపల్లి /బుచ్చయ్యపేట,ఐఏషియ న్యూస్: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) కింద కూలీలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. కానీ బుచ్చయ్యపేట మండలంలో ఈ నిధులు ఖర్చు కాగితాల పైనే కనిపిస్తున్నాయి కానీ పనులు జరిగాయంటూ అధికారులు, సాంకేతిక సిబ్బంది రికార్డులు చూపుతున్నా నేలమీద మాత్రం వాస్తవంగా కంటికి కనిపించడం లేదు.కోట్లు ఖర్చు చేశామని పేపర్లలో చూపిస్తుంటే, కూలీలకు మాత్రం ఒక్క రూపాయి ప్రయోజనం అందకపోవడం తో ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆగ్రహం చెందుతున్నారు. అరకొర పనులు చేసి, …

Read More »

22న విశాఖ గవర్నమెంట్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో మెగా జాబ్ మేళా

జాబ్ మేళా క్యాలెండర్ ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ దక్షిణ నియోజకవర్గ యువతీ యువకులు సద్వినియోగపరుచుకోవాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ పిలుపు విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో ఈనెల 22న ఉదయం 9 గంటలకు జైలు రోడ్డు వద్దగల ఉమెన్స్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో దాదాపు 30 కంపెనీలు పైగా 1,000 మంది పైగా ఉద్యోగాలు కల్పించడం కోసం మెగా జాబ్ మేళా …

Read More »

విద్యుత్ శాఖలో త్వరలోనే 2,511 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

అమరావతి,ఐఏషియ న్యూస్: విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. 1,711 జూనియర్ లైన్మెన్, 800 ఏఈఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. జెన్కో, ట్రాన్స్కో వివిధ కేడర్లలో 7,142 పోస్టులు ఖాళీగా ఉండగా ఒకేసారి కాకుండా ఏటా క్రమం తప్పకుండా భర్తీ చేస్తే సంస్థలపై ఆర్థిక భారం పడదని అధికారులు సీఎంకు వివరించారు.సాధ్యమైనంత త్వరగా 2,511 ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించగా, త్వరలోనే నోటిఫికేషన్ రానుంది. ఇది ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేసిన నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త అని చెప్పాలి. Authored by: Vaddadi …

Read More »