మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెండ్ల ఎదగడం నా చలవే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఐఏషియ ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో ఐటీ అభివృద్ధి టీడీపీ హయాంలోనే తన వల్లే జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. మైక్రోసాఫ్ట్ను మొట్టమొదటిగా హైదరాబాద్కు తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ అయిన సత్య నాదెళ్ల అక్కడి వరకు ఎదగడానికి నేను వేసిన బాటే మూలం” అని చెప్పారు. కాగా కడప జిల్లా జమ్మలమడుగులో పర్యటించిన ముఖ్యమంత్రి.గూడెంచెరువులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఆటోలో ప్రజల …
Read More »Politics
ప్రారంభమైన ఉప రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ
సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: జగదీప్ దన్ఖడ్ ఇటీవల ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. ఎన్నికకు సంబంధించిన ఎలక్టోరల్ కాలేజీని ఖరారు చేసినట్లు సీఈసీ ప్రకటించింది. రాజ్యాంగ నియమ నిబంధనల ప్రకారం.. ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా లోక్సభ సభ్యులతో పాటు రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు, నామినేటెడ్ సభ్యులు ఉంటారు. వీరంతా తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారుసెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించనున్నారు. Authored by: Vaddadi udayakumar
Read More »మక్కువ మండల గిరిజన గ్రామాలకు రగ్గులు పంపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
పార్వతీపురం /మక్కువ,ఐఏషియ న్యూస్: మక్కువ మండలంలోని ఆరు గిరిజన గ్రామాలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రగ్గులను పంపించారు. బుధవారం 6 గిరిజన గ్రామాలలో రగ్గులు పంపిణీ కార్యక్రమం జరిగింది.మండలంలోని బాగుజోలలో 24 కుటుంబాలు, చిలక మెండంగి లో 48 కుటుంబాలు, బెండమెడంగిలో ఐదు కుటుంబాలు, తాడిపుట్టిలో 10 కుటుంబాలు, దోయ్ వర లో ఐదు కుటుంబాలు, సిరివరలో 130 కుటుంబాలు వెరసి 222 కుటుంబాలకు, కుటుంబానికి మూడు రగ్గులు చొప్పున పంపిణీ జరిగింది. రగ్గులు పంపిణీ పట్ల గిరిజనులు సంతోషం వ్యక్తం …
Read More »తమిళనాడు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలిగా ఖుష్బూ
చెన్నై,ఐఏషియ న్యూస్: ప్రముఖ సినీనటి ఖుష్బూ సుందర్ తమిళనాడు రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదంతో కొత్త రాష్ట్ర వర్గాన్ని నియమించినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా 14మంది నియమితులు కాగా ఈ జాబితాలో ఖుష్బూకు చోటు దక్కింది. ప్రస్తుతం ఆమె జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా, బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. తనకు ఈ పదవి ఇచ్చిన బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డాకు …
Read More »ఆంధ్రప్రదేశ్ మహిళలకు శుభవార్త
ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ వెల్లడి ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ మహిళలకు శుభవార్త ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహిళలకు ఉచిత బస్సు పథకంపై క్లారిటీ వచ్చేసింది.ఆగస్ట్ 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పించనున్న సంగతి తెలిసిందే. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని తొలుత జిల్లాలకే పరిమితం చేయాలని …
Read More »సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన సూపర్ సక్సెస్
ఏపీకి తిరుగు ప్రయాణమైన సీఎం చంద్రబాబు సింగపూర్,ఐఏషియా న్యూస్: పెట్టుబడులను ఆకర్షించటం, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు చేపట్టిన సింగపూర్ పర్యటన విజయవంతంగా పూర్తయ్యింది. మంత్రులు నారా లోకేష్ , పి.నారాయణ, టీజీ భరత్ సహా ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి సింగపూర్ లో నాలుగు రోజుల పాటు అవిశ్రాంతంగా వివిధ సమావేశాలు, రౌండ్ టేబుల్ చర్చల్లో పాల్గొన్నారు. సింగపూర్ లోని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను సందర్శించి వాటిని రాష్ట్రంలో అమలు చేసేందుకు వీలుగా అధ్యయనం చేశారు. పర్యటనలో మొత్తం 26 కార్యక్రమాలకు …
Read More »క్యూఆర్ కోడ్ తో కొత్తరేషన్ కార్డులు మంజూరు
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి ఆగస్టు 25న కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ కోసం ఎదురుచూస్తున్న లబ్దిదారులకు ప్రభుత్వం ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే పాత రేషన్ కార్డుల జారీ స్ధానంలో అత్యాధునిక ఫీచర్లతో రేషన్ కార్డులు తీసుకొస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా వాటి జారీ తేదీని ఖరారు చేసింది. ఈ వివరాలను ఇవాళ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ వెల్లడించారు.ఏపీలో త్వరలో …
Read More »పెట్టుబడులు పెట్టండి…పేదలకూ సాయం చేయండి
ఏపీ-సింగపూర్ స్టార్టప్ ఫెస్టివల్ నిర్వహిస్తాం విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు రండి ఏపీ-సింగపూర్ బిజినెస్ ఫోరమ్ రోడ్ షోలో సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలపై సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియన్యూస్: పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ ఎంపిక అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆ పెట్టుబడులు కూడా అత్యంత భద్రంగా ఉంటాయని పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. ఈ ఏడాది నవంబర్ లో విశాఖలో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు సన్నాహకంగా ఏపీ- సింగపూర్ బిజినెస్ ఫోరమ్ తరపున రోడ్ …
Read More »గోవా రాష్ట్ర గవర్నర్ గా అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం
ప్రమాణ స్వీకారం చేయించిన బొంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే భారీగా హాజరైన కేంద్ర,ఏపీ మంత్రులు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియన్ న్యూస్: ఏపీ రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల పాటు వివిధ పదవుల్లో పనిచేసిన సీనియర్ నేత అశోక్ గజపతిరాజు శనివారం గోవా గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. గోవా రాజ్ భవన్ లో జరిగినకార్యక్రమంలో అశోక్ గజపతిరాజు గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీలు, కేంద్రమంత్రులు, ఏపీ …
Read More »బిఆర్ఎస్ ని బిజెపిలో విలీనం చేస్తానని కేటీఆర్ తనతో చెప్పారు
అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు అనకాపల్లి ఐఏషియన్ న్యూస్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తానని కేటీఆర్ తనతో స్వయంగా అన్నారని రమేష్ ఆరోపించారు.ఈ ఆరోపణ నిజమో, కాదో కేటీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల కేటీఆర్.. బీజేపీ, కాంగ్రెస్లు కలిసి తెలంగాణలో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని.. హెచ్సీయూ భూముల అమ్మకంలో ప్రభుత్వానికి సహకరించిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్కు క్విడ్ ప్రోకోగా …
Read More »
News Website (iasianews.net) I Asia News