Politics

మట్టిలో దాగున్న బంగారు నిధి..మన దేశంలోని 5 పెద్ద బంగారు గనులివే

స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్:  మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో భారీగా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు ఇటీవల జరిపిన సర్వేలో వెల్లడైంది. భూగర్భ శాస్త్రవేత్తలు చాలా ఏళ్లుగా కష్టపడి చేసిన పరిశోధనల తర్వాత ఈ అరుదైన విషయాన్ని ధృవీకరించారు.ఈ కొత్త ఆవిష్కరణ మధ్యప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో గొప్ప మార్పు తీసుకురావచ్చని భావిస్తున్నారు. అంతేకాదు, మన దేశంలో ఇంకా చాలా చోట్ల ఇలాంటి బంగారు నిధులున్నాయి.ఆ విశేషాలు, భారతదేశంలోని అతిపెద్ద ఐదు బంగారు గనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణాటకలోని హట్టి గోల్డ్ మైన్స్ హట్టి గోల్డ్ మైన్స్ భారతదేశంలోనే …

Read More »

బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి బాలకృష్ణ భూమిపూజ

అమరావతి,ఐఏషియ న్యూస్:  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.హాస్పిటల్ చైర్మన్, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తుళ్లూరు సమీపంలో ఈ ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నారు. 21 ఎకరాల విస్తీర్ణంలో మూడు దశల్లో ఈ ఆసుపత్రి నిర్మాణం జరగనుంది.మొదటి దశలో 500 పడకల సామర్థ్యంతో విస్తృతశ్రేణిఆంకాలజీసేవలుఅందిస్తారు. శస్త్రచికిత్సలు, వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, రోగుల సంరక్షణ కోసం ఇంటిగ్రేటెడ్ కేర్ మోడల్‌ను అమలు చేస్తారు. రెండో దశలో పడకల …

Read More »

జిల్లాల పునర్విభజనపై మంత్రుల బృందం కసరత్తు

29, 30 తేదీల్లో 13 జిల్లాల్లో మంత్రుల బృందం పర్యటనకు ముహూర్తం ఖరారు సెప్టెంబర్ 15 నాటికి ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వనున్న మంత్రుల బృందం డిసెంబర్ 31 లోపు జిల్లాల పేర్లు సరిహద్దుల మార్పుల ప్రక్రియ పూర్తి (వడ్డాది ఉదయకుమార్) ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఏపీలో జిల్లాల పునర్విభజనపై మరో కీలక అడుగు పడింది. ఇప్పటికే ప్రభుత్వం జిల్లాల పునర్విభజన కోసం నియమించిన మంత్రుల బృందం బుధవారం అమరావతి సచివాలయంలో సమావేశమైంది. ఇందులో మంత్రులు అనగాని సత్యప్రసాద్, పి.నారాయణ, వంగలపూడి అనిత, బీసీ …

Read More »

టీజీఎస్ఆర్టీసీ రాఖీ రికార్డు.. 2.51 కోట్ల ఉచిత ప్రయాణాలు

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: రాఖీ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ బస్సులను మహిళలు పెద్దఎత్తున వినియోగించుకున్నారు.6 రోజుల్లో మొత్తం 3.68 కోట్ల మంది రాకపోకలు సాగించగా అందులో 2.51 కోట్ల ఉచిత ప్రయాణాలు ఉన్నాయి.ఈ నెల 9న రాఖీ పండుగ నాడు 45.62 ల‌క్షల మంది మహిళలు ప్రయాణించారు.11న అత్యధికంగా 45.94 లక్షల మంది రాకపోకలు సాగించారు.ఒక్కరోజులో ఇంతమంది మహిళలు ప్రయాణించడం ఇదే తొలిసారి.గత ఏడాది రాఖీకి 2.75 కోట్ల మంది రాకపోకలు సాగించారు.ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు సందర్భం బట్టి భారీగా వినియోగించుకుంటున్నారని అధికారులు గుర్తించారు. ఏది …

Read More »

నాకు ప్రాణహాని ఉంది: పూణే కోర్టునాశ్రయించిన రాహుల్ గాంధీ

  పూణే,ఐఏషియ న్యూస్:  కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలకు తెరతీశారు.పూణేలోని స్పెషల్ కోర్టుకు హాజరైన సందర్భంగా తనకు ప్రాణహాని ఉందని వెల్లడించారు. తన ప్రాణాలకు హాని ఉందని రక్షించాలని కోర్టును తెలిపారు. గతంలో తాను వీర్ సావర్కర్‌పై చేసిన ప్రకటన సందర్భంగా తన ప్రాణాలకు ముప్పు ఉందని రాహుల్ గాంధీ చెప్పారు. ఇప్పటికే తాను చేసిన వ్యాఖ్యలపై ఇద్దరు నేతలు బెదిరించినట్లు వివరించారు. తాజాగా పూణే ప్రత్యేక కోర్టుకు హాజరైన సమయంలో తనకు మరింత భద్రత …

Read More »

రెండు గంటల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు రోడ్డు ప్రయాణం

విజయవాడ,ఐఏషియ న్యూస్: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం వరాలను ప్రకటిస్తూనే ఉంది. రెండు తెలుగురాష్ట్రాల మధ్య రహదారుల విస్తరణపైన దృష్టి సారించిన కేంద్రం జాతీయ రహదారులను, గ్రీన్ ఫీల్డ్ హైవేలను అందిస్తూ రవాణా సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు, పారిశ్రామిక ప్రగతికి దోహదం చేస్తుంది. ఇక రెండు తెలుగురాష్ట్రాల మధ్య ప్రయాణాన్ని మరింత సులువు చేయాలని భావించిన కేంద్రం హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి ఎన్ హెచ్ 65 విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆరు వరుసలుగా ఎన్హెచ్ 65 విస్తరణ ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న …

Read More »

15 నుంచి వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా 700 సేవ‌లు

నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌మ‌స్య‌ల‌పైనా శాస్త్రీయ విశ్లేష‌ణ జ‌ర‌గాలి డ్రోన్ల‌ను పెద్దఎత్తును వినియోగించుకోవాలి పురుగుమందులు, ఎరువుల వినియోగం త‌గ్గేలా టెక్నాల‌జీని ఉప‌యోగించుకోవాలి ఆర్టీజీఎస్ పై స‌మీక్షా స‌మావేశంలో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆర్టీజీఎస్ లో అవేర్ 2.0 వెర్ష‌న్ ను ఆవిష్క‌రించిన సీఎం ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ నుంచి మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా 700 ర‌కాల ప్ర‌భుత్వ సేవ‌ల‌ను పౌరుల‌కు అందించ‌నున్నామ‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. సోమ‌వారం స‌చివాల‌యంలోని రియ‌ల్ …

Read More »

ఏపీలో మహిళల ఉచిత బస్సు ప్రయాణం మార్గదర్శకాలు జారీ

అమరావతి,ఐఏషియ న్యూస్:  ఏపీలో కూటమి సర్కార్ కీలక ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం స్త్రీశక్తికి సంబంధించి ప్రభుత్వం ఇవాళ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ పథకం ఏయే బస్సుల్లో అమలవుతుంది, టికెట్ల జారీ ఎలా ఉంటుంది, ఇతర వివరాలుతో కూడిన జీవోను ప్రభుత్వం జారీ చేసింది. ప్రస్తుతానికి స్త్రీ శక్తి పథకాన్ని రాష్ట్రంలో అందుబాటులో ఉన్న బస్సులతోనే ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పథకం అమలు ప్రారంభం అయ్యాక అవసరాన్ని బట్టి కొత్త బస్సుల్ని కొనుగోలు చేసి ఇందులో చేరుస్తామని …

Read More »

అమరావతి రాజధాని నిర్మాణానికి రెండు లక్షల విరాళం అందజేత

అమరావతి,ఐఏషియ న్యూస్: నరసరావుపేటకు చెందిన కాసా నాగేంద్రమ్మ అనే వృద్ధురాలు రాజధాని నిర్మాణానికి విరాళం అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని సోమవారం సచివాలయంలో కలిసి రూ.2,00,116 చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా నాగేంద్రమ్మకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, టిడిపి నేతలు ఉన్నారు. Authored by: Vaddadi udayakumar

Read More »

ఏకపక్షంగా లక్షల ఓట్లు రద్దు చేయడం దారుణం

మంగళగిరి,ఐఏషియ న్యూస్: ఓట్లు సవరణల పేరుతో ఏకపక్షంగా 67 లక్షల ఓట్లను బీహార్లో రద్దు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని సిపిఎం జిల్లా నాయకులు ఎస్ ఎస్ చెంగయ్య, సీనియర్ నాయకులు జెవి రాఘవులు అన్నారు. శుక్రవారం మంగళగిరి అంబేద్కర్ సెంటర్లో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి వి వి జవహర్లాల్ అధ్యక్ష వహించారు. వారు మాట్లాడుతూ బీహార్ రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణల పేరుతో …

Read More »