Politics

ఉచిత ఆర్‌టీసీ బ‌స్సు సౌక‌ర్యం తిరుమ‌ల కొండ పైవ‌ర‌కు పొడిగింపు

ఆర్టీసీ చైర్మన్ కొన‌క‌ళ్ల నారాయ‌ణరావు తిరుమల,ఐఏషియ న్యూస్: ఏపీలో ‘స్త్రీశ‌క్తి’ పేరుతో ఉచిత ఆర్‌టీసీ బ‌స్సు సౌక‌ర్యంఈనెల 15 నుంచి ప్రారంభించింది.ఈ ప‌థకానికి అపూర్వ స్పంద‌న వ‌స్తుంద‌న్న ఏపీఎస్ఆర్‌టీసీ ఛైర్మ‌న్ కొన‌క‌ళ్ల నారాయ‌ణరావు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకుఇప్పుడు తిరుమ‌ల కొండ‌ పైవర‌కు కూడా ఈ సౌక‌ర్యం వ‌ర్తింపు చేశారు.అయితే ఘాట్ రోడ్డు కార‌ణంగా సిటింగ్ వ‌ర‌కే అనుమ‌తి ఇచ్చామని ఆర్టీసీ చైర్మన్ కొన‌క‌ళ్ల నారాయణరావు వెల్లడించారు. Authored by: Vaddadi udayakumar

Read More »

ముఖ్యమంత్రి అయిన ఉపేక్షించేది లేదు: పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

అమరావతి,ఐఏషియ న్యూస్: శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అటవీ అధికారులపై దాడులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించాయి. ఈ ఘటనపై అటవీ శాఖ సిబ్బంది స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వ పెద్దలు కూడా సీరియస్‌గా స్పందించారు.అటవీ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తన అనుచరులతో కలిసి వారిపై దాడి చేశారన్నారు. అంతేకాకుండా, వారిని వాహనాల్లో బంధించి, రాత్రంతా రెండు గంటల పాటు శ్రీశైలం …

Read More »

స్త్రీ శక్తి పథకం భారం కాదు,బాధ్యత

స్త్రీ శక్తి పధకం ఎప్పుడెప్పుడా అని మీడియా, ప్రతిపక్షాలు ఎదురు చూసారు సినిమా సక్సెస్ మీట్ లాగా స్త్రీ శక్తి సక్సెస్ మీట్ పెట్టడం సంతోషం స్త్రీ శక్తి పథకం విజయవంతం:మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ,ఐఏషియ న్యూస్: స్త్రీ శక్తి పథకం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతుండటంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆర్టీసీ హౌస్ లో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో మీడియాతో మాట్లాడారు.స్త్రీ శక్తి పథకం ఎప్పుడొస్తుందా అని మీడియా, ప్రతిపక్షాలు ఎదురు చూశాయి. ఇప్పుడు సినిమా సక్సెస్ …

Read More »

బీసీడీ కుల ధ్రువీకరణతో నగరాలకు ఎంతో మేలు

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి,ఐఏషియ న్యూస్: రాష్ట్రంలో నగరాల అభివృద్ఢికి సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను నగరాల సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరుపిళ్ల తిరుమలేశ్, ఆ సామాజిక వర్గ నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఎన్నికల్లో ముందు ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేశ్ కు, మంత్రి సవితకు కృతజ్ఞతలు తెలియజేశారు. నగరాలందరికీ …

Read More »

ఢిల్లీలో టిడిపి పార్లమెంటరీ పార్టీ కార్యాలయం సందర్శించిన నారా లోకేష్

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర సహకారం మరింతగా పొందడానికి, రాష్ట్ర ఐటీ, విద్య, హెచ్ ఆర్ డి మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని సోమవారం టిడిపి పార్లమెంటరీ పార్టీ కార్యాలయంకు ఆహ్వానించినట్లు విశాఖ పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ తెలిపారు.మంత్రి నారా లోకేష్ తో ఎంపీ శ్రీభరత్ , తోటి సహచర ఎంపీలు కలిసి పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి కీలకమైన పలు ప్రాజెక్టులపై చర్చలు జరిపారు.ఈ సమావేశాల్లో ఎంపీ శ్రీభరత్ …

Read More »

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో మంత్రి లోకేష్ భేటీ

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో సోమవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉదారంగా అర్థిక సాయం అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి పనుల పురోగతిని వివరించిన లోకేష్.ఎపిలో కొత్త ప్రాజెక్టులకు సహకారం అందించాల్సిందిగా నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తిచేశారు. అదేవిధంగా కేంద్ర విదేశీయాన శాఖ మంత్రి జై శంకర్ తదితర …

Read More »

మీ మద్దతు కావాలి: జగన్ కు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫోన్

ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ ఏపీలో కీలక మలుపులు ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కోసం ఎన్ డీఏ కూటమి ఆరాటం ఇండియా కూటమి అభ్యర్థి పెడితే ఎన్నిక అనివార్యం న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఢిల్లీ కేంద్రంగా ఏపీలో కీలక రాజకీయ సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఉప రాష్ట్రపతి ఎన్నిక వేళ బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న రాధాకృష్ణన్ ను తమ కూటమి అభ్యర్దిగా ఖరారు చేసింది. ఈ ఎన్నికలో ఇండియా కూటమి తమ అభ్యర్ధిని పోటీకి దింపేందుకు కసరత్తు చేస్తోంది. …

Read More »

అధికార దుర్వినియోగంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు హైకోర్టు నోటీసులు

అమరావతి,ఐఏషియ న్యూస్:  రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్, అధికార దుర్వినియోగానికి పాల్ప‌డుతున్నార‌ని ఏపీ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. మంత్రిగా రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన ప‌ద‌విలో ఉంటూ ప‌రిపాల‌నను గాలికొదిలేసి, రాష్ట్రానికి చుట్టం చూపుగా వ‌స్తు, సినిమాల‌పైనే శ్ర‌ద్ధ వ‌హిస్తూ,ఎక్కువ కాలం హైద‌రాబాద్‌లోనే గ‌డుపుతున్నార‌ని ఏకంగా రాష్ట్ర అత్యున్న‌త ధ‌ర్మాసనంలో పిటిష‌న్ వేశారు మాజీ ఐఏఎస్ అధికారి విజ‌య్‌కుమార్‌.జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై విజయ్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం వాదనలు జరిగాయి. మంత్రి పదవిలో కొనసాగుతూ సినిమాల్లో నటించడం చట్టబద్ధమేనా? …

Read More »

లోక్ సభను వెంటనే రద్దు చేయాలి: ఈసీపై ఇండియా కూటమి ఆగ్రహం

  న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఇండియా’ కూటమి సోమవారం నాడు ఎన్నికల సంఘంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.ఎన్నికల సంఘం(ఈసీ) పక్షపాతంగా వ్యవహరిస్తోందని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడిందని ఆరోపించింది. ముఖ్యంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు హడావిడగా ఓటర్ల జాబితాలో మార్పులు చేయడంపై కూటమి నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా,ఎస్పీ నుంచి రాంగోపాల్ యాదవ్, ఆర్‌జేడీ నుంచి మనోజ్ ఝా, ఆప్ …

Read More »

ఎరువుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌వ‌ద్దు

వ్యవసాయ శాఖ,మార్క్ ఫెడ్ ఉన్న‌తాధికారుల‌తో సమీక్షా సమావేశం నిర్వహించిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజ‌య‌వాడ‌,ఐఏషియ న్యూస్:  ఎరువుల సరఫరాలో ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా, ప్రణాళిక బద్ధంగా జరిగేటట్లుగా సరైన చర్యలు తీసుకోవాలని, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వ్య‌వ‌సాయ‌ అధికారులను రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అదేశించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఎరువుల పంపిణీ స‌జావుగా సాగుతున్నా కూడాకొన్నిప్రాంతాల్లోఇబ్బందులుత‌లెత్తుతున్నాయ‌ని తెలుసుకున్న మంత్రి విజ‌య‌వాడ‌లోని క్యాంప్ కార్యాల‌యంలో వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు, మార్క్ ఫెడ్ ఎండీ మనజీర్ జిలాని …

Read More »