Politics

సెప్టెంబర్ ఒకటి నుంచి మూడు రోజులు పాటు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన

తాడేపల్లి,ఐఏషియ న్యూస్: సెప్టెంబర్‌ 1,2,3 తేదీల్లో వైయస్సార్సీపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ పులివెందుల లో పర్యటించనున్నారు. ఒకటవ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు పులివెందుల చేరుకుని భాకరాపురంలోని క్యాంప్‌ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు.రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. రెండవ తేదీన పులివెందుల నివాసం నుంచి బయలుదేరి ఉదయం 7.15 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ వైయస్సార్ ఘాట్‌ వద్ద తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్.రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పిస్తారు. ఆ …

Read More »

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం,క్రికెటర్ అజారుద్దీన్ ఎంపిక

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, క్రికెటర్ అజారుద్దీన్ ను ఎంపిక చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. గతంలో సిఫార్సు చేసిన అమేర్ అలీఖాన్ స్థానంలో అజారుద్దీన్ కు చోటు దక్కింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈమేరకు కేబినెట్ లోతీర్మానించి గవర్నర్ కు పంపించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ఎదురు చూస్తున్న అజారుద్దీన్ కు అనూహ్యంగా ప్రభుత్వం ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఎవరిని ఎంపిక చేస్తారో …

Read More »

ప్రజాస్వామ్యంలో హింస పని చేయదు,జెండా కర్రే ఆయుధం

జనసేనాని,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపు విశాఖపట్నం,ఐఏషియ బ్యూరో: ప్రజాస్వామ్యంలో హింస పనిచేయదని,జెండా కర్రే ఆయుధం, గుండెల నుంచి వచ్చే మాటే తూటా కావాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ జనసైనికులకు పిలుపునిచ్చారు.అలా చేస్తే కచ్చితంగా మార్పు వస్తుందన్నారు. శనివారం విశాఖపట్నం మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.పార్టీ సభ్యత్వ నమోదు కోసం దసరా తర్వాత త్రిశూల్‌ పేరుతో కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు స్థిరత్వం కావాలని,కూటమి సర్కారు బలంగా …

Read More »

విశాఖ బీచ్ లో హాప్ ఆన్ హాప్ అఫ్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు

విశాఖపట్నం,,ఐఏషియ న్యూస్: విశాఖలో పర్యాటకానికి మరింత ఆకర్షణ జోడిస్తూ డబుల్ డెక్కర్ బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విశాఖ బీచ్ రోడ్డులో హాప్ ఆన్ – హాప్ అఫ్ డబుల్ డెక్కర్ పర్యాటక బస్సులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు 16 కిలోమీటర్ల మేర పర్యాటక ప్రాంతాల్లో తిరగనున్న ఈ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల్లో స్వయంగా ప్రజా ప్రతినిధులతో కలిసిసీఎంకొంతదూరంప్రయాణించారు. బస్సు నుంచే బీచ్ లో ఉన్న పర్యాటకులకు అభివాదం చేశారు. …

Read More »

విశాఖ పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 68వ రోజు ప్రజాదర్బార్

సమస్యలు విన్నవించేందుకు పార్టీ కార్యాలయానికి తరలివచ్చిన ప్రజలు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వినతులు స్వీకరించిన మంత్రి లోకేష్ విజ్ఞప్తులు త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ విశాఖపట్నం,ఐఏషియ బ్యూరో: వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విశాఖ నగరానికి వచ్చిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఉదయం విశాఖ పార్టీ కార్యాలయంలో 68వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ ను కలిసేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రజలు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. వివిధ సమస్యలపై అర్జీలు ఇచ్చారు. ప్రతిఒక్కరిని ఆప్యాయంగా …

Read More »

తిరుపతికి మరో వందే భారత్: విశాఖ టు బెంగళూరు

విశాఖపట్నం,ఐఏషియ బ్యూరో: రైల్వే అధికారులు శ్రీవారి భక్తుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న డిమాండ్ పై సానుకూలంగా స్పందించారు. తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. మరిన్ని కొత్త సర్వీసుల కోసం ఎంపీలు రైల్వే మంత్రికి నేరుగా ప్రతిపాదనలు చేస్తున్నారు. తాజాగా విశాఖ నుంచి బెంగళూరుకు వయా తిరుపతి కొత్త వందేభారత్ ఖరారు పైన తుది కసరత్తు జరుగుతోంది. డివిజన్ అధికారులు రూట్, షెడ్యూల్ పైన నివేదికలు ఇచ్చారు. విశాఖ టు బెంగళూరు తెలుగు రాష్ట్రాలతో …

Read More »

అమెరికా పెంచిన టారిఫ్ పై భారత్ లో హైలెవెల్ సమావేశం

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్:  భారత్ పై అమెరికా సుంకాల పెంపుదల చేసిన క్రమంలోనే తొలి విడతలో భాగంగా ఈ నెల మొదట్లోనే 25 శాతం సుంకాలు భారత్‌పై విధిస్తున్నట్లు ప్రకటించి అమలు చేస్తున్నారు. అయితే ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా నుంచి తక్కువ ధరకే చమురును దిగుమతి చేసుకుంటోందని పేర్కొన్న ట్రంప్ భారత్‌పై మరో 25 శాతం అదనపు సుంకాలు విధించనున్నట్లు బహిరంగంగానే వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ అదనపు సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) మంగళవారం హైలెవల్ …

Read More »

జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో పెన్ డ్రైవ్,వాట్సాప్ సర్వీసులు నిషేధం

శ్రీనగర్ ,ఐఏషియ న్యూస్:  అన్ని ప్రభుత్వ శాఖల్లో కార్యాలయాల్లో పెన్‌డ్రైవ్‌లు, వాట్సాప్ సర్వీసులపై నిషేధం విధిస్తున్నట్లు జమ్మూ కాశ్మీర్‌లోని ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌లోని కీలక శాఖలు, వెబ్‌సైట్‌లపై భారీఎత్తున సైబర్ దాడులు జరగ్గా వాటిని దృష్టిలో ఉంచుకుని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి జమ్మూ కాశ్మీర్‌లోని అన్ని ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌లలో పెన్‌డ్రైవ్‌లు వాడడాన్ని నిషేధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక డేటాను ట్రాన్స్‌ఫర్ చేసేందుకు ఉపయోగించేవాట్సాప్ …

Read More »

ఉస్మానియా అభివృద్ధికి 1000 కోట్లు కేటాయింపు

హైదరాబాద్,ఐఏషియ న్యూస్:  తెలంగాణ చరిత్రకు సజీవ సాక్ష్యమైన ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంతో పోల్చదగ్గ స్థాయికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర సమాజానికి, తెలంగాణ ఉద్యమానికి పునాది వేసిన ఈ విశ్వవిద్యాలయాన్ని కాలగర్భంలో కలిసిపోనీయకుండా, గ్లోబల్ స్టాండర్డ్స్‌తో తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఆర్ట్స్‌ కాలేజీ ఠాగూర్ ఆడిటోరియంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడారు. విద్యార్థుల కోసం కొత్త హాస్టల్ భవనాలు, లైబ్రరీ రీడింగ్ రూమ్‌కు శంకుస్థాపన చేశారు. అలాగే కొత్తగా …

Read More »

ఆధార్ ను తప్పనిసరిగా గుర్తింపు కార్డుగా స్వీకరించాల్సిందే

బీహార్ ఎన్నికలవేళ తేల్చి చెప్పిన సుప్రీం కోర్ట్ న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: మన దేశంలో ప్రభుత్వ గుర్తింపు కార్డుల్లో కీలకమైన ఆధార్ కార్డు ఎన్నికల్లో ఓటు హక్కు పొందేందుకు చెల్లుబాటయ్యే పత్రాల్లో ఒకటిగా ఎప్పటి నుంచో ఉంది. అయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆధార్ ను ఓటరుగా నమోదు అయ్యేందుకు తగిన పత్రంగా ఎన్నికల సంఘం గుర్తించకపోవడంతో వివాదం మొదలైంది. దీనిపై ఇప్పటికే ఈసీకి అక్షింతలు వేసిన సుప్రీంకోర్టు.. ఆధార్ ను తప్పనిసరిగా గుర్తింపు కార్డుగా స్వీకరించాల్సిందేనని ఇవాళ తేల్చిచెప్పేసింది.బీహార్ లో ప్రత్యేక ఓటరు …

Read More »