
డిప్యూటీ కమిషనర్ సుజాతకు ఈవోగా అదనపు బాధ్యతలు
సింహాచలం,ఐఏషియ న్యూస్: సింహాచలం శ్రీ వరహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిపాలనలో మార్పులు చోటు చేసుకున్నాయి.ప్రస్తుత ఈవో వి త్రినాధరావు బదిలీ ఆకస్మికంగా కావడంతో, డిప్యూటీ కమిషనర్ సుజాతకు సింహాచలం దేవస్థానం ఈవో అదనపు బాధ్యతలు అప్పగిస్తూ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి హరిజవహర్ లాల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఇంత హడావుడిగా సింహాచలం ఈవో త్రినాధ రావు బదిలీపై సర్వత్ర చర్చంసనీయంగా మారింది. ఈ బదిలీ వెనక ఆంతర్యం ఏమిటా? అని దేవస్థానం ఉద్యోగులు,రాజకీయ ప్రముఖులు ఆరా తీస్తున్నారు. వివాద రహితుడిగా ఉన్న ఈవో త్రినాధరావుకు ఈ విధంగా బదిలీ వేటుపడడం పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈవో త్రినాధరావు బద్రీనాథ్ ప్రజల్లో సింహాచలం ఈవోగా ఎవరు రానున్నారని విషయంపై పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News