హైదరాబాద్,ఐఏషియ న్యూస్: “పద్మశ్రీ” పురస్కార గ్రహీత – బృహత్ ద్విసహస్రావధాని – మహాకవి – బ్రహ్మశ్రీ డా. మాడుగుల నాగఫణిశర్మకు దర్శనం పత్రిక 21వ వార్షికోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో చేసిన “గురుసత్కారం” కార్యక్రమంలో “జీవన సాఫల్య పురస్కార ప్రదానం ” కార్యక్రమం అత్యద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ కేంద్ర గనుల శాఖామంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తుమ్మల నాగేశ్వరరావు , తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచంద్రరావు, సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ. లక్ష్మీనారాయణ, మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావు,ప్రముఖ వేదకవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, ప్రముఖ జర్నలిస్ట్ మాశర్మ తదితరులు పాల్గొని నాగఫణిశర్మ ఆశీర్వాదాలను పొందారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News