విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: రైల్వే టికెట్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, ప్రయాణికుల సౌకర్యాన్ని పెంపొందించేందుకు రైల్వే శాఖ కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈనెల1 నుంచి వచ్చిన నిబంధనల ప్రకారం ఇకపై ఐఆర్సీటీసీ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవాలంటే, ఆ ఖాతాకు ఉన్న మొబైల్ నంబరు ఆధార్తో లింక్ అయి ఉండాలి. లింక్ చేసిన ప్రయాణికులు ఉదయం 8 గంటలకు రిజర్వేషన్ టికెట్లు పొందగలరు, లింక్ కానివారు 8.15 గంటల తరువాత మాత్రమే బుక్ చేసుకోవచ్చు. విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించాలి.
Authored by: Vaddadi udayakumar