డ్వాక్రా మహిళలకు “మన డబ్బులు- మన లెక్కలు” ఏఐ యాప్ ఏర్పాటు

  • రాష్ట్రవ్యాప్తంగా 83 లక్షల డ్వాక్రా మహిళలకు అందుబాటులోకి రానున్న యాప్
  • ఈ యాప్ వినియోగంపై మహిళలకు శిక్షణ ఇవ్వనున్న ప్రభుత్వం
  • ఈ యాప్ వినియోగం వల్ల మహిళలకు బ్యాంకర్లు, క్షేత్రస్థాయి సిబ్బందితో పనిలేదు

ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా సంఘాల్లో ఎలాంటి అక్రమాలకు అవకాశం లేకుండా పారదర్శకంగా ఉండేందుకు సరికొత్త ఆలోచన చేసింది. “మన డబ్బులు-మన లెక్కలు” అనే ఏఐ ఆధారిత యాప్‌ను తీసుకొచ్చారు. ఈ యాప్ ఇప్పటికే 260 చోట్ల పైలట్ ప్రాజెక్టుగా అమలవుతోంది. డిసెంబరు నాటికి రాష్ట్రవ్యాప్తంగా 83 లక్షల మంది డ్వాక్రా మహిళలకు ఇది అందుబాటులోకి రానుంది. ఈ కొత్త యాప్ డ్వాక్రా సంఘాల పనితీరులో మరింత స్పష్టతను తీసుకువస్తుంది. పొదుపు సంఘాల మహిళలు తమ ఆర్థిక లావాదేవీలను సులభంగా అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు ఏటా భారీగా లావాదేవీలు చేస్తున్నారు. డ్వాక్రా మహిళలు బ్యాంకు లింకేజీ ద్వారా ఏటా రూ.40,000 కోట్లు తీసుకుంటున్నారు. పొదుపు నుంచి మరో రూ.20,000 కోట్లు వాడుతున్నారు. అలాగే రూ.40,000 కోట్ల వరకు రుణాలు తిరిగి చెల్లిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నా, ప్రతి నెలా ఎక్కడో ఒకచోట నిధుల గోల్‌మాల్ జరుగుతోంది. కొందరు లక్షల్లో అక్రమాలకు పాల్పడుతున్నారు. కానీ, రికవరీ చాలా తక్కువగా ఉంది. కేసులు కూడా పెద్దగా నమోదు కావడం లేదు. అయితే ఈ నిధుల్లో తరచుగా గోల్‌మాల్ జరుగుతోంది. రికార్డులు సరిగా లేవు. ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ‘మన డబ్బులు-మన లెక్కలు’ కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా డ్వాక్రా సభ్యులు తమ బ్యాంకు ఖాతా వివరాలను ఫోన్‌లోనే సులభంగా చూసుకోవచ్చు. దీనివల్ల సమావేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. క్షేత్రస్థాయి సిబ్బంది, బ్యాంకర్లతో కూడా అవసరం లేదు. కేవలం ఫోన్‌లో ఒక క్లిక్ చేస్తే చాలు, డ్వాక్రా బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్ వెంటనే కనిపిస్తుంది.ఈ కొత్తయాప్ బ్యాంకు పనుల గురించి అంతగా తెలియని, చదువుకోని మహిళలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఏఐ సాయంతో పనిచేసే ఈ యాప్ ద్వారా నోటితో అడిగినా సరైన సమాచారం వస్తుంది. నెలవారీ డబ్బులు కట్టడంలో గానీ, పొదుపులో గానీ తేడాలు ఉంటే వెంటనే ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఫిర్యాదులను రాష్ట్రస్థాయిలో ఎప్పుడూ చూస్తూ ఉంటారు. వచ్చిన ఫిర్యాదులను వారం రోజుల్లోనే పరిష్కరిస్తారు. మహిళలకు ఈ కొత్త యాప్ ఎలా వాడాలో శిక్షణ కూడా ఇస్తారు.కొత్త యాప్ ద్వారా సంఘ సభ్యులు తమ వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఈ యాప్ సంఘం పేరు, ఐడీ, సభ్యుల సంఖ్య, వారి పేర్లు వంటి సమాచారాన్ని అందిస్తుంది. అలాగే, సభ్యురాలి పేరు, గుర్తింపు సంఖ్య, కుటుంబ సభ్యుల పేర్లు, ఫోన్ నంబరు కూడా చూపిస్తుంది. సభ్యురాలు చేసిన పొదుపు, సంఘం మొత్తం పొదుపు వివరాలు కూడా ఇందులో ఉంటాయి. తీసుకున్న రుణాలైన బ్యాంకు రుణం, స్త్రీనిధి, కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్ (సిఐఎఫ్), ఉన్నతి రుణం, అంతర్గత అప్పు (డ్వాక్రా/వీవో) వివరాలు, అవి తీసుకున్న తేదీతో సహా ఈ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. గత నెలలో ఎంత రుణ వాయిదా చెల్లించారు, ఇప్పటివరకు ఎన్ని వాయిదాలు కట్టారు, ఇంకా ఎన్ని నెలలు కట్టాలి అనే సమాచారం కూడా యాప్‌లో ఉంటుంది. మొత్తం ఎంత డబ్బు జమ అయింది, ఇంకా ఎంత బాకీ ఉన్నారు అనే వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ప్రతి నెలా ఎంత వడ్డీ కడుతున్నారు అనే వివరాలు కూడా ఈ యాప్‌లో స్పష్టంగా చూపిస్తుంది.ఈ యాప్ డ్వాక్రా మహిళలకు వరం లాంటిదని ప్రభుత్వాధికారులు పేర్కొంటున్నారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

Indian Diaspora in Dallas Celebrates BJP Victories in Assam, Bengal, and Puducherry

McKinney, Texas, May 10 — Overseas Friends of BJP (OFBJP-USA), Dallas Chapter, has organized a …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *