గీతం ఎమ్‌సిఎ విద్యా ర్ధులకు భారీ వేతనంతో ఉద్యోగాలకు ఎంపిక

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: ప్రముఖ ఐటి సంస్థ మైక్రాన్‌ గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ ద్వారా ఎమ్‌సిఎ కోర్సు అభ్యసిస్తున్న విద్యార్ధులను భారీ వేతనంలో ఎంపిక చేసుకుంది. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం లోనే జరిగిన ఈ ప్రాంగణ నియామకంలో ఎమ్‌సిఎ ఆఖరి సంవత్సరం విద్యార్ధులు ఎస్‌.లహరి మోహన్‌, ఎమ్‌.వర్షిణి, పి.భవాని, కె.హర్షవర్ధన్‌రెడ్డి, ఎన్‌.మనోజ్‌ రూ.12.26 లక్షల వార్షిక వేతనంతో మైక్రాన్‌ సంస్థకు ఎంపికయ్యారు గీతం స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌లో ఎమ్‌సిఎ సహ పలు సైన్స్‌ కోర్సులు అభ్యసిస్తున్న వారికి ప్రత్యేకంగా నిర్వ హిస్తున్న కెరీర్‌ గైడెన్స్‌ విభాగం అందించిన సహకారంలో విద్యార్ధులు ఈ ఘనత సాధించారు. కాగా ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్ధులను స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె.వేదవతి,కంప్యూటర్‌ సైన్స్‌ విభాగం అధిపతి ప్రొఫెసర్‌ టి.ఉమాదేవి అభినందించారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

డ్వాక్రా గ్రూప్ కుటుంబ సభ్యులకు ప్రత్యేక జాబ్ మేళా

ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్:  ఏపీలో డ్వాక్రా సంఘాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్న కూటమి సర్కార్ ఇవాళ మరో కీలక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *