టీటీడీ బోర్డు సభ్యునిగా టీవీఎస్ మోటార్స్ సీఎండీ సుదర్శన్ వేణు

తిరుమల,ఐఏషియ న్యూస్: టీవీఎస్ మోటార్స్ సీఎండీ సుదర్శన్ వేణును టీటీడీబోర్డు సభ్యునిగా నియమిస్తూ ప్రభుత్వం గురువారంఉత్తర్వులు జారీచేసింది. 29 మంది సభ్యులతో గత ఏడాది టీటీడీ నవంబర్ లో బోర్డు సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.అయితే ఈ సభ్యుల్లోసుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్ దత్తును సభ్యునిగా నియమించగా ఆయన ఇప్పటివరకు ప్రమాణ స్వీకారం చేయలేదు. అందుచేత ఆ సభ్యుని తొలగించి ఆ సభ్యుని స్థానంలోట్రస్ట్ బోర్డ్ సభ్యులుగా సుదర్శన్ వేణును నియమించింది.ఈయనకు గతంలోనూ తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఈయన త్వరలో బాధ్యతలు స్వీకరిస్తారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

సింహాచల అన్నదాన పథకానికి రూ. 1.16 లక్షల విరాళం

సింహాచలం,ఐఏషియ న్యూస్: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీ సింహద్రినాథ శాశ్వత అన్నప్రసాద …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *