భువనేశ్వర్,చాన్విక జ్యోతిన్యూస్: ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో కేవలం 187 హోమ్ గార్డ్ పోస్టులకు ఏకంగా 8వేలమంది పోటీపడ్డారు. వీరిని నియంత్రించడం కష్టంగా మారటంతో చేసేదేం లేక అధికారులు జమదర్పాలి ఎయిస్ట్రిప్ రన్వేనే ఎగ్జామ్ హాల్ గా మార్చేశారు. అభ్యర్థులందరూ ఎండలోనే కూర్చుని పరీక్ష రాశారు.ఈ ఉద్యోగానికి కనీస విద్యార్హత 5వ తరగతి మాత్రమే. కానీ పోటీ పడ్డ వారిలో డిగ్రీ, పీజీ, బీటెక్ చదివిన వారు కూడా ఉండటం గమనార్హం.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News