నేడు వైయస్సార్‌సీపీ ‘ఛలో మెడికల్‌ కాలేజీ’

పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో కార్యక్రమం

తాడేపల్లి,ఐఏషియ న్యూస్: తమ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన 10 కొత్త మెడికల్‌ కాలేజీలు ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈనెల 19న ‘ఛలో మెడికల్‌ కాలేజీ’ చేపడుతున్నట్లు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని పార్టీ వెల్లడించింది. ఆ రోజున ఆయా కాలేజీల వద్దకు వెళ్లే పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులు అన్ని వాస్తవాలను ప్రజలకు వివరిస్తారని పార్టీ తెలియజేసింది. శాంతియుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారని పార్టీ తెలిపింది.ఈ మేరకు వైయస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఒక ప్రకటన చేస్తూ.. పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ‘ఛలో మెడికల్‌ కాలేజీ’లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల

అమరావతి,ఐఏషియ న్యూస్: 2 కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏపీలో 28కి పెరిగిన జిల్లాలు. రెవెన్యూ డివిజన్ల మార్పులు, చేర్పులు బుధవారం నుంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *