
గ్రామీణ ప్రజలకు సంక్రాంతి కానుక ప్రకటించిన సీఎం చంద్రబాబు
అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీ ప్రజలకు ప్రభుత్వం సంక్రాంతి కానుక ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్న క్యాంటీన్ల పై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న అన్న క్యాంటీన్లు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే సంక్రాంతి కానుకగా అన్న క్యాంటీన్లు గ్రామీణ ప్రజలకు కూడా అందుబాటులోకి రానున్నాయి. అన్న క్యాంటీన్లకు మంచి స్పందన వస్తోంది. ఈ క్యాంటీన్లను జనవరి 13నుంచి15మధ్యక్యాంటీన్లుప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.గ్రామీణ ప్రాంతాల్లోనూ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం 70 క్యాంటీన్లను మంజూరు చేసింది.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News