హైదరాబాద్,ఐఏషియ న్యూస్: హైదరాబాద్ లోని కోకాపేటలో భూములు మరోసారి రికార్డు ధర పలికాయి. ఎకరం ధర ఏకంగా రూ.137 కోట్ల 25 లక్షలు పలికింది. నియోపోలిస్ లో ఉన్న ప్లాట్ నెంబర్ 17లో 4.59 ఎకరాలు,ప్లాట్ నెంబర్ 18లో 5.31 ఎకరాలకు హెచ్ ఎండీఏ అధికారులు వేలం నిర్వహించారు. అయితే సర్వే నెంబర్ 17లోని ఎకరం భూమి ధర రూ.137.25 కోట్లు పలికింది. హెచ్ ఎండీఏ పరిధిలోని ఖరీదైన భూములను ఆన్ లైన్ వేదికగా వేలం వేయడానికి తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News