మంగళగిరి,ఐఏషియ న్యూస్: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా మంగళవారం మంగళగిరిలోని 6వ బెటాలియన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. అమరులు వారు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News