తిరుమల,ఐఏషియ న్యూస్: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముహూర్తం సమీపిస్తోంది. ఈనెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి టీటీడీ విజిలెన్స్, పోలీసులతో సమావేశం నిర్వహించారు.ఇందులో బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల భద్రత, రవాణా, పార్కింగ్ సదుపాయాలు, క్రౌడ్ మేనేజ్మెంట్ వంటి అంశాలపై చర్చించారు. బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చేందుకు అవకాశం …
Read More »admin
మారిషస్ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామ్గులాంకు విమానాశ్రయంలో ఘన స్వాగతం
స్వాగతం పలికిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తిరుపతి,ఐఏషియ న్యూస్: మారిషస్ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామ్గులాం ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయంకు సోమవారం చేరుకున్నారు.తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు విచ్చేసిన మారిషస్ ప్రధాని.మారిషస్ ప్రధానికి ఘన స్వాగతం పలికిన మంత్రి ఆనం, పలువురు నేతలు, ఉన్నతాధికారులు.రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా బ్రహ్మశ్రీ ఆశ్రమమునకు చేరుకొని,అనంతరం తిరుమల చేరుకోనున్న మారిషస్ ప్రధాని.మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న ప్రధాని నవీన్ చంద్ర రామ్గులాం. Authored by: Vaddadi udayakumar
Read More »తెలుగును బతికించండి మహాప్రభో…
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: తెలుగును ఓ పాఠ్యాంశంగా కాకుండా తెలుగు భాషలో ప్రాథమిక విద్యాబోధనకు పెద్ద పీట వేసి, ఆంగ్లాన్ని పాఠ్యాంశంగా బోధించడం ద్వారా తెలుగు భాషను పరిరక్షించాలని “తెలుగు దండు” ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం తెలుగు మాధ్యమం పట్ల సానుకూల నిర్ణయం తీసుకోని పక్షంలో అసెంబ్లీ సమావేశాల్లో గాంధేయ మార్గంలో సాగే మాతృభాష పరిరక్షణ ఉద్యమ ఉధృతిని రుచి చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. విశాఖపట్నంలోని తెలుగు దండు కార్యాలయంలో సోమవారం ఉదయం తెలుగు భాషాభిమానులు విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలుగుదండు …
Read More »టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు తమిళనాడు రాష్ట్ర మంత్రి నెహ్రూ 44 లక్షలు విరాళం
తిరుమల,ఐఏషియ న్యూస్: తమిళనాడు రాష్ట్ర మంత్రి కెఎన్ నెహ్రూ నవంబర్ 9న తన పుట్టినరోజు సందర్భంగా ఒక్కరోజు అన్నప్రసాదం వితరణకు అయ్యే ఖర్చు రూ 44 లక్షలు టిటిడి ఎస్వీ అన్నదాన ట్రస్ట్ కువిరాళమిచ్చిన దాత కెఎన్ నెహ్రూ టిటిడి చైర్మన్ క్యాంప్ కార్యాలయంలోచైర్మన్ బీఆర్ నాయుడుని కలిసి విరాళం డిడిని అందజేసిన దాత తరపు ప్రతినిధి సురేష్. Authored by: Vaddadi udayakumar
Read More »అల్లూరి జిల్లాలో గిరిజనులకు వంతెన కష్టాలు
పెదబయలు,ఐఏషియ న్యూస్:: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పలు మారుమూల గ్రామాల్లో రహదారి సౌకర్యం లేక గిరిజనుల కష్టాలు వర్ణానతీతం.పెదబయలు మండలంలోని జామిగుడ పంచాయతీ పరిధి తారాబుకి చెందిన కుమడ.శ్రీదేవికి శనివారం గుండె నొప్పి వచ్చింది.గ్రామానికి రహదారి సౌకర్యం లేక అంబులెన్స్ రాక కుటుంబీకులు డోలికట్టి శ్రీదేవికి తారాబు జలపాతం వరకు మోసుకొచ్చి ఎత్తుకొని ప్రాణం అరచేతిలో పెట్టుకొని ఉదృతంగా ప్రవహిస్తున్న వాగును దాటించారు.అక్కడ నుంచి జీపులో ముంచంగిపుట్టు ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారు మాట్లాడుతూ..ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అధికారులు స్పందించి తారాబు గ్రామానికి …
Read More »బీజేపీలో చేరిన ప్రముఖ న్యాయవాది మళ్ల తులసీరాం
పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పీవీఎన్ మాధవ్ విశాఖపట్నం,,ఐఏషియ న్యూస్: నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది మళ్ల తుల సీరాం శనివారం భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఈ సందర్భంగా మళ్ల తులసీరామ్ కు పార్టీ కండువా కప్పి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు. ప్రధాని మోదీని ఆదర్శంగా తీసుకుని, బీజేపీ పథకాలు, పరిపాలన పట్ల ఆకర్షితుడైనయ్యానని ఈ సందర్భంగా మళ్ల తులసీరాం తెలియజేశారు. తులసీరాం 1999 నుంచి 2008 నుంచి ఎన్ఎస్ యూఐలో పని చేశారు. ఆ …
Read More »రైతులు ఆందోళన చెందవద్దు… రాష్ట్రంలో ఎరువులు సరిపడా నిల్వలు ఉన్నాయి..
అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం వారం రోజుల్లో మరింత యూరియా రాష్ట్రానికి చేరుకోనుందని వెల్లడించిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి,ఐఏషియ న్యూస్: రాష్ట్రంలో ఎరువులు ఎటువంటి కొరత లేకుండా అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టంచేశారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. విజయవాడలోని క్యాంప్ ఆఫీస్ లో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం యూరియా, డీఎపి, పొటాష్, కాంప్లెక్స్ ఎరువులు సహా అన్నిరకాల ఎరువులు సరిపడా నిల్వలుగా ఉన్నాయని తెలిపారు. జిల్లా వారీగా …
Read More »భారతదేశ 15వ ఉప రాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం
న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అత్యంత వైభవంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాధాకృష్ణన్ చేత పదవీ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు హాజరయ్యారు.వీరితోపాటుమాజీ …
Read More »తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్
తిరుమల,ఐఏషియ న్యూస్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆలయంలో శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమలకు చేరుకున్న నిర్మల సీతారామన్ కు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆమెకు వేదాశీర్వచనం చేశారు. తీర్థ ప్రసాదాలు, శ్రీవారి ఫోటోను అందజేశారు. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో భక్తులకు …
Read More »రఘు ఇంజినీరింగ్ కాలేజీలో రక్తదాన శిబిరం
భీమునిపట్నం,ఐఏషియ న్యూస్: భీమునిపట్నం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో శుక్రవారం రఘు ఇంజనీరింగ్ కాలేజీలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో అదిక సంఖ్యలో విద్యార్థులు ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు 498 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ కార్యక్రమంలో రఘు విద్యాసంస్థల చైర్మన్ రఘు కలిదిండి కరస్పాండెంట్ రమాదేవి ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ కుమార్ డాక్టర్ జగదీష్ డీన్ డాక్టర్ సతీష్ చౌదరి ఎన్ఎస్ఎస్ ఆఫీసర్స్ కృష్ణ కిషోర్ బి ఎస్ వెంకట్ రెడ్డి విభాగాదిపతులు విద్యార్థులు పాల్గొన్నారు రక్తదాతలకు చైర్మన్ …
Read More »
News Website (iasianews.net) I Asia News