admin

జన్మభూమి ఎక్స్ ప్రెస్ నుంచి జారిపడి బిటెక్ విద్యార్థి దుర్మరణం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: తుని రైల్వే స్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ ఎక్కుతూ రైలు కిందపడి తీవ్రంగా గాయపడిన ఆదిత్య కళాశాల విద్యార్థి గరికిన హేమన్ రాజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం వెంకటనగరం గ్రామానికి చెందిన హేమన్ రాజు సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. కళాశాలకు వెళ్లేందుకు జన్మభూమి ఎక్స్ప్రెస్ ఎక్కుతూ జారి పడడంతో అతని రెండు కాళ్లు తెగిపోయాయి. తీవ్రంగా గాయపడిన హేమన్ రాజును విశాఖపట్నంలోని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం …

Read More »

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు గవర్నర్ కు ఆహ్వానం

ఆహ్వానించిన ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్, ఈవో నాయక్ విజయవాడ,ఐఏషియ న్యూస్:  దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్, దుర్గగుడి ఈవో వి.కె.శీనా నాయక్‌తో కలిసి దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రికను బుధవారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ కి అందజేశారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల కోసం జరుగుతున్న ఏర్పాట్ల పురోగతిని వారు గవర్నర్ కు దేవాదాయ కమిషనర్ రామచంద్రమోహన్, ఈవో నాయక్ అన్ని విషయాలు వివరించారు. Authored by: Vaddadi udayakumar

Read More »

పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్,ఆర్మీ చీఫ్ మార్షల్ అసిమ్ మునీర్ ట్రంప్ తో భేటీ

25న న్యూయార్క్ లో ప్రత్యేక సమావేశం న్యూయార్క్,ఐఏషియ న్యూస్:  పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాగే భారత్- అమెరికా మధ్య కూడా ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం ఉంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్ పై 50 శాతం సుంకాలు విధించింది అమెరికా. ఈ టారిఫ్ లు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ క్రమంలో అమెరికా, పాకిస్థాన్ దగ్గరవుతున్నాయి. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ మార్షల్ …

Read More »

సిరిమాను చెట్టు గుర్తింపు

విజ‌య‌న‌గ‌రం,ఐఏషియ న్యూస్: ఉత్త‌రాంధ్ర క‌ల్ప‌వ‌ల్లి శ్రీ పైడితల్లి అమ్మ‌వారి సిరిమానోత్స‌వానికి కీల‌క‌మైన సిరిమాను చెట్టు గుర్తింపు పూర్త‌య్యింది. ఈ ఏడాది సిరిమాను చెట్టు గంట్యాడ మండ‌లం కొండ‌తామ‌రాప‌ల్లి గ్రామంలో సాక్షాత్క‌రించిన‌ట్లు పైడిత‌ల్లి సిరిమాను పూజారి బంటుప‌ల్లి వెంక‌ట‌రావు వెళ్ల‌డించారు.దీంతో ఈ గ్రామానికి చెందిన చ‌ల్లా అప్ప‌ల‌నాయుడు, నారాయ‌ణ‌మూర్తి, రామ‌కృష్ణ క‌ల్లాల్లో సిరిమాను, లోక‌వ‌ర‌పు స‌త్యం క‌ల్లంలో ఇరుసుమానును గుర్తించారు.అత్యంత ప‌విత్ర‌మైన‌దిగా భావించే ఈ చెట్ల‌కు బుధ‌వారం వేద పండితుల మంత్రోఛ్చార‌ణ మ‌ధ్య సంప్ర‌దాయ‌బ‌ధ్దంగా పూజ‌లు నిర్వ‌హించి, బొట్టు పెట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంఎల్‌సి గాదె శ్రీ‌నివాసుల‌నాయుడు, …

Read More »

తుని తలుపులమ్మలోవ ఆలయానికి ఎస్కలేటర్ సౌకర్యం

17 కోట్ల వ్యయంతో అమ్మవారి ఆలయం పునర్నిర్మాణం నాలుగు కోట్లతో ఎస్కలేటర్ ఏర్పాటు స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లోనే తొలిసారిగా ఓ ఆలయంలో భక్తుల సౌకర్యం కోసం ఎస్కలేటర్ ఏర్పాటు చేస్తున్నారు. కాకినాడ జిల్లాలోని తునిలో ఉన్న తలుపులమ్మ లోవ అమ్మవారి గుడిలో ఎస్కలేటర్‌ ఏర్పాటు చేస్తున్నారు. 17 కోట్ల రూపాయలతో తలుపులమ్మ అమ్మవారి ఆలయంలో పునర్నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే నాలుగు కోట్ల రూపాయలతో ఎస్కలేటర్ ఏర్పాటు చేసేందుకు చర్యలుచేపడుతున్నారు. ఎస్కలేటర్ ఏర్పాటైతే ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ సౌకర్యం ఏర్పాటుచేస్తున్న మొదటి దేవాలయం …

Read More »

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఘనస్వాగతం

విశాఖపట్నం, ,ఐఏషియ న్యూస్: విశాఖపట్నం వేదికగా బుధవారం జరగనున్న వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి విశాఖ చేరుకున్న కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు స్థానిక నేతలు, అధికారుల నుంచి ఘన స్వాగతం లభించింది. విమానంలో మంగళవారం రాత్రి ఆమె విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆమెకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పి.వి. ఎన్. మాధవ్, విప్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు,మాజీ రాజ్యసభ …

Read More »

గవర్నమెంట్ విజువల్య్ హ్యాండీక్యాప్డ్ స్కూల్ విద్యార్థిని పి కరుణ ప్రపంచ క్రికెట్ కప్‌లో ఎంపిక 

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖ నగర పరిధిలోగల సాగర్ నగర్‌లోని గవర్నమెంట్ విజువల్య్ హ్యాండీక్యాప్డ్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న కుమారి పి.కరుణ భారతదేశం నుండి మొదటిసారిగా ప్రపంచ క్రికెట్ జట్టులోకి ఎంపికైంది.ప్రపంచంలోనే తొలిసారిగా బాలికల క్రికెట్ జట్టు ప్రపంచ కప్ ఆడబోతోంది. గతంలో, బ్లైండ్ బాలుర క్రికెట్ జట్టు ఉండేది, కానీ ఇప్పుడు మహిళా బ్లైండ్ గర్ల్స్ క్రికెట్ జట్టు మొదటిసారి క్రికెట్ ఆడనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు చెందిన కుమారి కరుణ భారతదేశం నుండి పదహారుమంది బాలికల జట్టులో ఎంపికైనందుకు నగరంలోని వేలాది మంది …

Read More »

విద్యుత్ శాఖ ఏడిఈ అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు

500 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని అంచనా హైద‌రాబాద్,ఐఏషియ న్యూస్: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణ నేపథ్యంలో విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వ‌హించారు.మంగ‌ళ‌వారం తెల్ల‌వార‌జాము నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు విరామం లేకుండా సోదాలు నిర్వ‌హించారు ఏసీబీ అధికారులు. ఏడీఈ అంబేద్క‌ర్ నివాసంతో పాటు ఆయ‌న కుటుంబ సభ్యులు, బంధువుల నివాసాల్లో సోదాలు నిర్వ‌హించారు. ఏసీబీ అధికారులు మొత్తం 15 బృందాలుగావిడిపోయిగచ్చిబౌలి , మాదాపూర్ , హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల్లో …

Read More »

నేడు లండన్ లో మంత్రి నారా లోకేష్ రోడ్ షో

నవంబర్ లో పార్టనర్ షిప్ సమ్మిట్ విజయవంతమే లక్ష్యం అమరావతి,ఐఏషియ న్యూస్:  ఏపి ప్రభుత్వం విశాఖలో నవంబర్ 14 15తేదీలల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ -2025 లో పాల్గొనాల్సిందిగా గ్లోబల్ లీడర్లను ఆహ్వానిస్తూ రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం రాత్రి లండన్ లో హైప్రొఫైల్డ్ ఇన్వెస్టర్స్ రోడ్ షో నిర్వహించనున్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరక్టర్స్, పాల్ మాల్ కన్వెన్షన్ వేదికగా రాత్రి 7గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 11.30గంటలకు) నిర్వహించే ఈ రోడ్ …

Read More »

కేఈ కృష్ణమూర్తిని వరించనున్న గవర్నర్ పదవి?

రాజ్యసభకు యనమల.. టిడిపికి దక్కనున్న మరో కేంద్ర మంత్రి పదవి (వడ్డాది ఉదయకుమార్) ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్:  మిత్రపక్షం టీడీపీకి బీజేపీ నాయకత్వం మరో ఆఫర్ ఇచ్చింది. ఎన్డీఏ బలోపేతంలో భాగంగా మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇస్తోంది. త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కేంద్ర మంత్రివర్గంతో పాటుగా కీలక పదవుల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ప్రాధాన్యత ఇస్తోంది. తాజా చర్చల్లో భాగంగా టీడీపీకి మరో గవర్నర్ పదవితో పాటుగా కేంద్రంలోని కీలక నియామకాల్లోనూ అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు …

Read More »