పులివెందుల,ఐఏషియ న్యూస్: వైయస్సార్ కడప జిల్లా పులివెందులలో వైఎస్ఆర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు శంకర నేత్రాలయ మేసు పుట్టపర్తి కుంబు తిరుమల రెడ్డి (యూఎస్ఏ) సంయుక్త నిర్వహణలో మెగా ఉచిత క్యాటరాక్ట్ సర్జరీ క్యాంపు ప్రారంభమైంది.కంటిశుక్లం స్క్రీనింగ్ 7 రోజుల పాటు జరుగుతుంది. ఈ ఉచిత వైద్య శిబిరంలో కంటి రోగులను పరీక్షించి కంటి శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి మొబైల్ ఐ సర్జరీ బస్సులో ఈనెల 26 నుంచి 30 వరకు ఉచిత కంటిశుక్లం శస్త్రచికిత్స …
Read More »admin
150 మంది విద్యార్థులకు ఉచితంగా ఐడి కార్డుల పంపిణీ
పామూరు,ఐఏషియ న్యూస్: పామూరు మండలం మారకొండాపురం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 150 మంది విద్యార్థులకు పాఠశాలలో గణితోపాధ్యాయునిగా పనిచేయుచున్న అట్లా వెంకటేశ్వర్లు సమకూర్చిన 7,000 ఆర్థిక సహకారంతో తయారు చేసిన స్టూడెంట్ఐ డికార్డులను ఉచితంగా శుక్రవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు ఐడికార్డులను ప్రధానోపాధ్యాయులు చావా శ్రీనివాసులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు కె. భాస్కరరెడ్డి,అట్లా వెంకటేశ్వర్లు,ఎస్.చైతన్య,వి.రమేష్ బాబు,ఎం.విజయ,డి.శ్రీలక్ష్మి,వి.జానకి జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు. Authored by: Vaddadi udayakumar
Read More »దొంగ మస్తర్లతో ఉపాధి హామీలో నిధులు గోల్ మాల్
అనకాపల్లి /బుచ్చయ్యపేట,ఐఏషియ న్యూస్: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) కింద కూలీలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. కానీ బుచ్చయ్యపేట మండలంలో ఈ నిధులు ఖర్చు కాగితాల పైనే కనిపిస్తున్నాయి కానీ పనులు జరిగాయంటూ అధికారులు, సాంకేతిక సిబ్బంది రికార్డులు చూపుతున్నా నేలమీద మాత్రం వాస్తవంగా కంటికి కనిపించడం లేదు.కోట్లు ఖర్చు చేశామని పేపర్లలో చూపిస్తుంటే, కూలీలకు మాత్రం ఒక్క రూపాయి ప్రయోజనం అందకపోవడం తో ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆగ్రహం చెందుతున్నారు. అరకొర పనులు చేసి, …
Read More »అనారోగ్యంతో సిపిఐ మాజీ ఎంపీ సురవరం మృతి
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: కమ్యూనిస్టు ఉద్యమానికి అపారమైన సేవలందించిన సీపీఐ జాతీయ అగ్రనేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి గురువారం రాత్రి నుంచి విషమించగా, హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతిచెందారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన సురవరం మహబూబ్నగర్ (పాలమూరు) జిల్లాకు చెందిన సుధాకర్ రెడ్డి విద్యార్థి దశ నుంచే కమ్యూనిస్టు సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. …
Read More »హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో లక్ష మందికి వినాయక మట్టి విగ్రహాలు పంపిణీ
హైదరాబాద్,ఐఏషియ న్యూస్బ్యూరో: హైదరాబాద్ నగరం ఎప్పుడూ పండుగల రంగుల హరివిల్లులా ఉంటుంది. ఏ పండుగ వచ్చినా అది పెద్దగా హడావుడి చేస్తుంటారు. ముఖ్యంగా వినాయక చవితి వస్తే ప్రతి వీధి, ప్రతి ఇల్లు కొత్త ఉత్సాహంతో కళకళలాడుతుంది. ఈసారి కూడా అదే ఉత్సాహం కనిపిస్తోంది. కానీ ఈసారి పండుగ ఉత్సవాలకు ఓ ప్రత్యేకత ఉంది. నగర ప్రజలకు హెచ్ఎండీఏ ఓ శుభవార్త చెప్పింది.గతంలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పిఓ పి) విగ్రహాలు జలవనరులను తీవ్రంగా కలుషితం చేశాయి. ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, ఇతర …
Read More »టిడిపి మద్దతు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ కే
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలు రాజకీయాలు చేయడం తగదు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ ను కలసిన సీఎం చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఉపరాష్ట్రపతి ఎన్నిక గడువు సమీపిస్తోన్న కొద్దీ దేశరాజధానిలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఎన్డీఏ- ఇండియా బ్లాక్ వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి. ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ గెలుపు నల్లేరు మీద నడకే. ఆరోగ్య కారణాల దృష్ట్యా ధన్ ఖర్ కిందటి నెలలో తన పదవికి రాజీనామా చేసిన …
Read More »ఏపీ పోలీసులు సత్తా చూపిన మహిళ డిఎస్పి హర్షిత మణికంఠ
అమరావతి,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ పోలీసుల సత్తా ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఓ మహిళా డీఎస్సీ ఏపీ పోలీసుల సత్తాను ప్రపంచ వేదికపై చాటారు.ఏపీ డీఎస్పీ హర్షిత మణికంఠ యూరోప్లోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎల్బ్రస్ పర్వత శిఖరాన్ని అధిరోహించారు.5,642 మీటర్ల ఎత్తైన మౌంట్ ఎల్బ్రస్ శిఖరాన్ని అధిరోహించిన హర్షిత మణికంఠ. ఏపీ పోలీసులకు గర్వకారణంగా నిలిచారని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రశంసించారు. ప్రపంచ వేదికపై ఆంధ్రప్రదేశ్ పోలీసులకు గర్వకారణంగా నిలిపిన క్షణం అంటూ వంగలపూడి అనిత ఈ వివరాలను పంచుకున్నారు.మరోవైపు మౌంట్ ఎల్బ్రస్ …
Read More »వియత్నాం అందాల పోటీల్లో సూపర్ గ్లోబల్ ఫస్ట్ రన్నరప్ గా బొడ్డేటి డింపుల్ హిరణ్య
విశాఖపట్నం,ఐఏషియ జ్యోతిబ్యూరో: వియత్నాం దేశంలో నిర్వహించిన అందాల పోటీల్లో విశాఖ గోపాలపట్నానికి చెందిన బొడ్డేటి డింపుల్ హిరణ్య సూపర్ గ్లోబల్ ఫస్ట్ రన్నరప్ గా నిలిచి విశాఖ ఖ్యాతి పెంచింది.గురువారం విశాఖ చేరుకున్న సందర్భంగా విశాఖ ఎయిర్ పోర్ట్ లో హిరణ్య బంధువులు, స్నేహితులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. విశాఖ టింపనీ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న హిరణ్యకు తల్లి ప్రవళిక అండదండలు అందిస్తూ తనదైన శైలిలో ఆమెను ప్రోత్సహిస్తుండటం ఆమెకు కలిసి వచ్చింది. హిరణ్య తాతయ్య పిల్ల రాజబాబు అమ్మమ్మ లావణ్య మనవరాలు …
Read More »సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం “కీర్తి పురస్కారానికి” ఎంపికైన రాధిక మంగిపూడి
విజయనగరం,ఐఏషియ న్యూస్: విజయనగర సాహితీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఈతరం రచయిత్రి రాధిక మంగిపూడి, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారానికి ఎంపిక అయ్యారు. 2023 సంవత్సరానికిగాను వివిధ రంగాలలో ప్రసిద్ధిగాంచిన 48 మందిని ఎంపిక చేసినట్లుగా, వారిలో హాస్య రచనల విభాగంలో రాధిక ఎంపికయ్యారని తెలుగు విశ్వవిద్యాలయం వారు గురువారం పత్రికా ప్రకటనలో తెలిపారు. రాధిక మంగిపూడి 2016లో సింగపూర్ లో తన సాహితీ ప్రస్థానం ప్రారంభించి ఇప్పటివరకు 3 కథా సంపుటలు,2 కవితా సంపుటలు,2 పద్య శతకాలు, ఒక వ్యాస సంపుటి …
Read More »గుంతలు పడిన రోడ్లపై టోల్ వసూలు చేయకూడదు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్:గుంతలు పడిన, డ్రైవింగ్ చేయడానికి అనువుగా లేని, ట్రాఫిక్ జామ్ అయిన రహదారులపై వాహనాదారులను టోల్ చెల్లించాలని బలవంతం చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. త్రిస్సూర్ జిల్లాలోని పలియక్కర ప్లాజా వద్ద టోల్ వసూలును నాలుగు వారాలపాటు నిలిపివేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును దేశ అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్వీ అంజరియాతో కూడిన ధర్మాసనం భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎస్హెచ్ఏఐ), టోల్ వసూల్ సంస్థ దాఖలు …
Read More »
News Website (iasianews.net) I Asia News