స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో జపాన్ ప్రధానిగా ఉన్న షిగెరు ఇషిబా ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలిగా సనై తకైచి ఎన్నికయ్యారు.ఈ నేపథ్యంలో ఈమె ప్రధాని పదవి చేపట్టనున్నారు. త్వరలోనే అధికార ప్రకటన రానున్నది. Authored by: Vaddadi udayakumar
Read More »Politics
కొందరు ఎమ్మెల్యే తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
అమరావతి,ఐఏషియ న్యూస్: ముఖ్యమంత్రి చంద్రబాబు కొందరు ఎమ్మెల్యేల తీరు పైన ఆగ్రహంతో ఉన్నారు. వారి తీరు పైన మంత్రివర్గ భేటీలో చంద్రబాబు అసహనం వ్యక్తం చేసారు. వారిని కట్టడి చేయాల్సిన బాధ్యతలను ఇంఛార్జ్ మంత్రులు తీసుకోవాలని స్పష్టం చేసారు. అప్పటికీ వారిలో మార్పు రాకపోతే ఇక తాను చర్యలు తీసుకోక తప్పదని తేల్చి చెప్పారు. కొందరు ఉద్దేశ పూర్వకంగా వ్యవహరించినా కారణం ఏదైనా వారిని నియంత్రించాల్సిన బాధ్యత ఇంఛార్జ్ మంత్రులేనని నిర్దేశించారు.అసెంబ్లీ సమావేశాల సమయంలో కొందరు ఎమ్మెల్యేల తీరు పైన సీఎం చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు. …
Read More »జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్లు ఏర్పాటు
ఏపీ స్టేట్ బ్యూరో,ఐఏషియ న్యూస్: జాతీయ హైవేపై ఆయా రహదారుల సమాచారం, అత్యవసర హెల్ప్లైన్ నంబర్లు తెలిపేలా క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్హెచ్ఏఐ తెలిపింది. ఈ క్యూఆర్ కోడ్లో సదరు రహదారుల ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారంతో పాటు నేషనల్ హైవే నంబర్, హైవే ఛైనేజ్, ప్రాజెక్ట్ పొడువు వివరాలను తెలియజేస్తాయి. ఇందులో హైవే గస్తీ, టోల్ మేనేజర్, రెసిడెంట్ ఇంజినీర్ల నంబర్లు, అత్యవసర హెల్ప్లైన్ నంబర్ 1033, పెట్రోల్ బంక్, ఆస్పత్రుల వివరాలు ఉంటాయి. Authored by: Vaddadi udayakumar
Read More »ఆధార్ అప్డేట్ రేట్లు పెరిగాయి: అమల్లోకి కొత్త ధరలు
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: ఆధార్ సేవల్లో కొత్త మార్పులు వచ్చాయి. ఇప్పటికే ఆధార్ అప్డేట్ కోసం యాప్ ద్వారా చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఆధార్ అప్డేట్ కోసం కొత్త ఫీజులను ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఖరారు చేసింది.ఛార్జీలను పెంచింది. పెరిగిన ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. ఏ సేవకు ఎంత చెల్లించాలో ఇప్పటికే ఖరారు చేసింది.దీంతో, కొత్త ధరల మేరకు ఆధార్ అప్డేట్.. సేవలు కొనసాగుతున్నాయి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ అప్డేట్ ఛార్జీలను పెంచింది. కొత్త ధరలు …
Read More »బీహార్లో తుది ఓటరు జాబితా విడుదల
పాట్నా,ఐఏషియ న్యూస్: బీహార్లో అనేక వివాదాలకు నెలవుగా మారిన ఓటరు జాబితా ప్రత్యేక సవరణను పూర్తి చేసిన ఎన్నికల సంఘం తుది ఓటరు జాబితాను ప్రకటించింది. ఎస్ఐఆర్ డ్రాఫ్ట్ జాబితాపై వచ్చిన అన్ని అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాను తయారు చేసినట్టు తెలిపింది. బీహార్లో ప్రధాన ఎన్నికల అధికారి తన సోషల్ మీడియాలో ఈ ప్రకటన చేశారు. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్? బీహార్ ఓటరు తుది జాబితా ప్రకటించడంతో వచ్చేవారం బీహార్ శాసనసభ ఎన్నికల షెడ్యూలును కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. …
Read More »పోర్టు హాస్పిటల్ ను కాపాడుకుంటాం 365వ రోజు నిరసన
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణ అపాలని 365వ రోజు హాస్పటల్ వద్ద మానవహారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిఐటియు గౌరవ అధ్యక్షులు పద్మనాభ రాజు మాట్లాడుతూ మన పోరాటం వలన గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ను కాపాడుకుంటాం. టెండర్ కి ఎవరి రాలేదు, హాస్పిటల్ అభివృద్ధి కోసం చైర్మన్ కమిటీ వేయడం జరిగింది. పోర్ట్ దగ్గర ఉన్న సోంత నిధులతో అభివృద్ధి చేయాలిహాస్పిటల్ ప్రైవేటీకరణ పై 365 రోజులుగా మాట్లాడుతున్న కార్మికులకు అభినందనలు.హాస్పిటల్ ప్రైవేటీకరణ అనైతికమని, హాస్పిటల్ అభివృద్ధి కార్మికుల కృషితోనే సాధ్యమైందని, …
Read More »సిఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రులు
సమీక్షించిన జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి దత్తిరాజేరు(విజయనగరం),ఐఏషియ న్యూస్: రాష్ట్రముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పలువురు మంత్రులు మంగళవారం పరిశీలించారు.దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో సిఎం చంద్రబాబు నాయుడు బుధవారం పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు నిర్వహిస్తున్న ఏర్పాట్లను జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత,రాష్ట్ర స్త్రీశిశు సంక్షేమశాఖామంత్రి గుమ్మిడి సంధ్యారాణి, రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి,ఎస్పి ఏఆర్ దామోదర్, జెసి ఎస్.సేతు మాధవన్తో కలిసి సిఎం పాల్గొనే వేదికలను పరిశీలించారు.అధికారులతో మాట్లాడి …
Read More »కరూర్ మృతులకు 20 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన విజయ్
చెన్నై,ఐఏషియ న్యూస్: టీవీకే విజయ్ కార్నర్ మీటింగ్లో తొక్కిసలాట 30 మంది మృతి, మరో 50 మంది పరిస్థితి విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. వినాపద్యంలో ఈ సంఘటనలో మృతి చెందిన వారికి 20 లక్షల గాయపడ్డ వారికి 2 లక్షల రూపాయలు నష్టపరిహారాన్ని విజయ్ ప్రకటించారు. బాధితులకు తాము అండగా ఉంటామని ఈ సందర్భంగా విజయ్ పేర్కొన్నారు. 10 లక్షల నష్టపరిహారం ప్రకటించిన తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కరూర్ తొక్కిసలాట లో మృతులకు 10 లక్షలు ఎక్స్ గ్రేషియా తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. గాయపడ్డ …
Read More »కన్నీటి కరూర్ కార్నర్ సమావేశం
తొక్కిసలాటలో 38 మంది దుర్మరణం..100మందికి పైగా క్షతగాత్రులు హుటాహుటిన కరూర్ చేరుకున్న సీఎం స్టాలిన్.. హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ చెన్నై,ఐఏషియ న్యూస్: తమిళనాట పెను విషాదం చోటుచేసుకుంది. ఒక రాజకీయ సభ మృత్యు వేదికగా మారింది. తమిళ సినీ నటుడు, తమిళ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ శనివారం కరూర్లో నిర్వహించిన రోడ్షోలో మరణ మృదంగం మోగింది. లెక్కకు మించిన జనం తరలివచ్చారు. దారులు మొత్తం కిక్కిరిసిపోయాయి. పరిస్థితి అదుపు తప్పి… తొక్కిసలాటకు దారి తీసింది. అధికార వర్గాలు అందించిన సమాచారం ప్రకారం… …
Read More »అక్టోబర్ 16న ఏపీ లో పర్యటించనున్న ప్రధాని మోదీ
అమరావతి,ఐఏషియ న్యూస్: ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు.ఆ రోజున శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని ఆయన దర్శించుకోనున్నారు.అలాగే జీఎస్టీ సంస్కరణలపై కర్నూలులో నిర్వహించే రోడ్ షోలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి పీఎం మోదీ పాల్గొననున్నారు.ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. Authored by: Vaddadi udayakumar
Read More »
News Website (iasianews.net) I Asia News