అమరావతి,ఐఏషియ న్యూస్: ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు.ఆ రోజున శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని ఆయన దర్శించుకోనున్నారు.అలాగే జీఎస్టీ సంస్కరణలపై కర్నూలులో నిర్వహించే రోడ్ షోలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి పీఎం మోదీ పాల్గొననున్నారు.ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News