పాట్నా,ఐఏషియ న్యూస్: ఆధ్యాత్మిక, జానపద గీతాలను ఆలపిస్తూ మైథిలీ ఠాకూర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు. బీహార్ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీకి ఎన్నికైన అతిపిన్న వయస్కురాలిగా నిలిచారు. మైథిలీ ఠాకూర్ అలీనగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన ఆమె ఆర్జేడీ దిగ్గజ నేత వినోద్ మిశ్రాను 11 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడించారు.
ఇన్స్టా, యూట్యూబ్లో కలిపి ఆమెకు 1.1 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.ఇక ఫేస్బుక్లో అయితే 1.4 కోట్ల మంది ఆమెను అనుసరిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన మైథిలీ ఠాగూర్ ను బిజెపి శ్రేణులు అభినందించారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News