లండన్,ఐఏషియ న్యూస్: హిందూజా గ్రూప్ ఛైర్మన్ గోపీచంద్ పి. హిందూజా (85) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న హిందూజా లండన్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం కన్నుమూశారు.హిందుజా ఫ్యామిలీలో రెండో తరానికి చెందిన గోపీచంద్ 2023లో గ్రూప్ సంస్థలకు ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయన సోదరుడు శ్రీచంద్ మరణానంతరం బాధ్యతలు స్వీకరించారు.గోపీచంద్ హిందుజాకు భార్య సునీత, కుమారులు సంజయ్, ధీరజ్, కుమార్తె రీతా ఉన్నారు. ఇండో- మిడిల్ ఈస్ట్ ట్రేడింగ్ ఆపరేషన్స్ నిర్వహించే సంస్థను అంతర్జాతీయ దిగ్గజ సంస్థల్లో ఒకటిగా నిలపడంలో ఆయన తనవంతు పాత్ర పోషించారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎనర్జీ, ఆటోమోటివ్, మీడియా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారాలను ప్రస్తుతం హిందూజా గ్రూప్ నిర్వహిస్తోంది. గోపీచంద్ హిందుజా మృతి పట్ల పలువురు సంతాపాన్ని వ్యక్తం చేశారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News