ఏపీ డీజీపీకి మానవహక్కుల సంఘం నోటీసులు

  • తిరుపతి డిప్యూటీ మేయర్ ఉపఎన్నిక సందర్భంలో ఘటనపై నోటీసులు
  • వైసీపీ ఎంపీ గురుమూర్తి ఫిర్యాదుపై స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ
  • దర్యాప్తు నివేదిక అందించాలని డీజీపీకి ఆదేశాలు

అమరావతి,ఐఏషియ న్యూస్: తిరుపతి డిప్యూటీ మేయర్ ఉపఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనలపై ఏపీ డీజీపీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) నోటీసులు జారీ చేసింది. ఎస్వీయూ క్యాంపస్‌లో జరిగిన హింసపై ఆరువారాల్లో నివేదిక సమర్పించాలని డీజీపీని ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశించింది.తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా రౌడీ మూకలు తమపై దాడి చేశారని,నిందితుల పేర్లతో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులుగా కేసు నమోదు చేశారని తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు.దాడి సమయంలో టీవీ ఛానళ్లలో ప్రసారమైన వీడియోలను గురుమూర్తి ఎన్‌హెచ్‌ఆర్సీకి సమర్పించారు.గతంలో వైసీపీ నేతలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని డీజీపీ నివేదికను ఎన్‌హెచ్‌ఆర్సీకి అందించారు.ఈ నేపథ్యంలో మరోసారి తాజా దర్యాప్తు నివేదికను సమర్పించాలని ఏపీ డీజీపీని ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశించింది.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

కార్మికులు, కార్మికుల కోసం మాట్లాడే వాళ్లంటే నాకు ఎంతో ఇష్టం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: కార్మికులు, కార్మికుల కోసం మాట్లాడే వాళ్లంటే నాకు ఎంతో ఇష్టమని సినీ నటులు ప్రకాష్ రాజ్ అన్నారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *