
విరాళం ఇచ్చిన కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: ఏపీ విద్యార్థుల కోసం హైదరాబాద్కు చెందిన కంపెనీ భారీ విరాళం ఇచ్చింది. ఏపీ విద్యార్థులకు అమలవుతున్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ పథకానికి.. కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ సంస్థ ఈ విరాళం ఇచ్చింది. దాదాపు రూ.40 లక్షల రూపాయల విలువైన లక్ష నోట్ పుస్తకాలు, పెన్నులను అందించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వీటిని పంచుతారు. విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ ఈ పుస్తకాలు, పెన్లు ఉన్న ట్రక్ను జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సహాయం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ ఎండీ కేఎల్ శ్రీధర్రెడ్డి, డైరెక్టర్ ప్రీతమ్రెడ్డి, సమగ్ర శిక్షాఅభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News