24,729 ఓట్ల మెజార్టీ సాధించిన నవీన్ యాదవ్
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: హైదరాబాద్ జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఉప ఎన్నికలో హస్తం పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. నవీన్ యాదవ్కు 98,988 ఓట్లు రాగా.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత 74,259 ఓట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి 17,061 ఓట్లతో డిపాటిజ్ కోల్పోయారు.ఉప ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన నవీన్ యాదవ్ ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.ఎమ్మెల్యేగా ఎన్నికైన నవీన్ యాదవ్ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News