
19 నుంచి 23 వరకు పుట్టపర్తి కూడా ప్రత్యేక బస్సులు
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖ నుండి శబరిమలై భక్తులు కొరకు స్పెషల్ ప్యాకేజీ బస్సులు నడుపుతున్నట్లు విశాఖ ఆర్టీసీ ఆర్ఎం బి అప్పలనాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.అదేవిధంగాపంచరామాలకి మంచి స్పందన ఉన్నందున ఈనెల 22, 23 తేదీలలో కూడా పంచారామాలకు బస్సులు స్పెషల్ నడుపుతున్నట్లు ఆర్.ఎం పేర్కొన్నారు.అదేవిధంగా శ్రీ సత్య సాయిబాబా జయంతి ఉత్సవాల సందర్భంగా ఈనెల 19వ తారీకు నుండి 23వ తారీకు వరకు 100 సంవత్సరాల పుట్టినరోజు ఉత్సవాలు జరుపుతున్నారని ఈ సందర్భంగా స్పెషల్ బస్సులు డిమాండ్ తగ్గట్టుగా విశాఖ నుండి నడపబడునని కావలసినవారు ద్వారకా బస్ స్టేషన్ ఏపీఎస్ఆర్టీసీ కాంప్లెక్స్ లో 9959225602 సంప్రదించాలన్నారు.
శ్రీ సత్యసాయి బాబా అనంతపూర్ జిల్లా పుట్టపర్తికి బస్సులు వివిధ ప్రాంతాల నుండి ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు ఆర్ ఎం అప్పలనాయుడు తెలియజేశారు.ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News