15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వంగర తహసిల్దార్ మహేందర్

మహాబూబాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణ రాష్ట్రం మహాబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలంలో రైతు భూక్యా బాలు నుంచి 25వేలు లంచం డిమాండ్ చేసిన తహసీల్దార్ మహేందర్.భూమి మ్యుటేషన్ కోసం డిమాండ్ చేసిన లంచంలో శుక్రవారం15 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఎసిబి కి పట్టుబడ్డ తహసీల్దార్ మహేందర్.ఎసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో ఈ ఏసీబీ దాడులు జరిగాయి. జిల్లాలో అన్ని తహసిల్దార్ కార్యాలయ అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా ఈ దాడి పట్ల ఉలిక్కిపడ్డారు. లంచం తీసుకున్న తాసిల్దార్ పై కేసు నమోదు చేసి ఎసిబి కోర్టుకు తరలించారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

హైదరాబాద్ లో డ్రగ్స్ పెడ్లింగ్ ముఠా అరెస్ట్

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: హైదరాబాద్ లో మాదకద్రవ్యాల వ్యాపారం మరోసారి కలకలం రేపింది. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ , చిక్కడపల్లి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *